ద్వి తీ యా శ్వా స ము
25
క. చెలువలరుపరువులోతును
గలిగి విశుద్ధాంబువులను గమనీయంబై
జలరాశి చౌకఁ జేయుచుఁ
బలు తేఱఁగుల పరిఘ లమరుఁ బట్టణసీమన్.14
సీ. పరిఘాదిలోతును బరపును నెల్లెడ
నేడువారాసుల నేలుకొనును
వస్త్రసమున్నతి వదల కద్భుతముగా
నాకాశమండలం బదుముకొనుచు
కడ లేనిమేడలపొడవు భానునితోడ
మించి యొక్కట నావరించుకొనును
గృహములవిభవంబు గీర్వాణసౌఖ్యంబు
వేడుకతో కడు వాడుకొనును
గీ. నవనిధానంబులను మహోత్ససమునయము
నింపు సొంపొందఁ దనలోన నిముడుకొనును
ననుచు నందఱు గొనియాడ నవనిలోన
సాటి కెక్కెను శ్రీదక్షవాటిపురము.15
ఉ. కోరిక మీఱ నప్పురముగోపురముల్ గగనంబు ముట్టి యిం
పార నతిక్రమించినభయంబునఁ ద్రోవయు గానరాక పెం
పారసి పద్మబాంధవుఁ డహర్నిశముం దనరూపు రూఢిగా
సోరణగండ్లలోఁబరపుచుం దగఁ జూపును కాలమానముల్.16
ఉ. మెచ్చులు మీఱ నప్పురము మే లగుహర్మ్యతలాగ్ర సీమలం
జెచ్చెర నాడుబాలికలచిత్తము లుబ్బఁగ వచ్చి వేడ్కతో
నచ్చరలేమలం గలిసి యద్భుతవాక్యవిశిష్టవైఖరిన్
ముచ్చటలాడుచుండెదరుమోదముతోడుతఁగూడినిచ్చలున్.17