పుట:ధనాభిరామము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

11

   భక్తి శ్రవణావతంసంబు బట్టె నొకతె
   కూడిమెల్లన మంతనం బాడె నొకతె.43
 
వ. మరియు తక్కినవిలాసినీజనులు లజ్జాననలై హృజ్జాతుని మొగంబు వీక్షించిన. 44

క. సురరాజుతోడ మన్మథు
   వెరవున సభవారు వినగ నిట్లని పలికెన్
   బరికింప నిందు నందును
   తరుణులకును రూపెగాక ధన మేమిటికిన్. 45

ఉ. మానితరూపయౌవనసమగ్రతచే తుదిముట్టి పై కళా
    స్థానము లంగభేదములు జాతులుతప్ప కెఱింగి కామవి
    ద్యానిపుణుండునై మెలఁగునాతనిగూడి రమించునట్టి యా
    మానిని యొండొరుంగవయ మైకొనునే ధనమెంత యిచ్చినన్.46

ఉ. చేరిక జేసి యంగనలు చిత్తము లప్పు డెరింగి పొందగా
    నేరక గాఢపాకముల నెంతయు కాంక్షలు దీర్పజూచినన్
    నీరజలోచనల్ ధనము నించక బిల్వరు కాక మేలు కీ
    డారసి రూపవంతునిఁ బ్రియంబునగూడ ధనంబు జూతురే. 47

క. వలపుగలవిటుని కౌగిలి
   గలిగిన లోనుబ్బుఁగాక కామిని యొరులన్
   దలచునె మానము ప్రాణము
   దలచునే ధనధాన్యతతుల తనమదిలోనన్.48
 
వ. అని యివ్విధంబున రూపవిలాస విశేషంబులు యోషాచయంబుల మోహాతిశయంబులకు విహారస్థానంబులని రూపంబు ప్రతిష్ఠించి ధనంబు నిరసంబుగా నాడిన కుబేరుండు