తృతీయాశ్వాసము
77
నానందించెద నను నవ
మానింపం దగునె రాజ్యమదమున నీకున్.111
క. ఏపున నవమానింపుచు
నీపొలఁతికిఁ జూపిచూపి నిష్ఠురమతి వై
నాపాదంబులు గుదిచిన
పాపంబున విరహవహ్నిఁ బడు వివశుఁడ వై.112
వ. అని శపియించిన సాంబుండు నిజజీవితేశ్వరిం బాయంజాలక
విషణ్ణహృదయుం డై మహాభాగా! యెఱుంగక చేసితి
సహింపు మని దండనమస్కారంబు సేసినం జూచి హంస
కరుణించి యీజన్మంబున శాపఫలం బనుభవింపకుండునట్లు
గా ననుగ్రహించితి నావచనం బమోఘం బగుటం జేసి యవ
శ్యంబు ననుభవింపవలయు నీ విం కొకజన్మంబున దేహాం
తరగతయైన యిమ్మగువకు మగండవై మదీయచరణయుగ
ళంబు నిగళితంబు గావించిన యీముహూర్తద్వయంబు
నకు మాసద్వయంబు నిగళితచరణుండ వై వియోగదుఃఖం
బనుభవించి పగంపడి నిజాంగనాసహితుండ వై రాజ్య
సుఖంబు లనుభవింపుమని వారియపరజన్మంబునకు జాతిస్మర
త్వంబు దయసేసెం గావున మరాళంబుతోడి మేలంబు వల
దని కథారూపంబున నిజపూర్వజన్మవృత్తాంతంబు సూచిం
చిన రాజవాహను పలుకులు విని యవంతిసుందరియునుం
దనపురాతనజన్మవృత్తాంతం బగుటం దెలిసి యితండు మ
త్ప్రాణవల్లభుండగు నని యుల్లంబు పల్లవింపం దన్ను నత
నికిం దెలుపం దలంచి యెఱుకపడ ని ట్లనియె:113