ఏకాదశాశ్వాసము
299
స్తారకు (గా నొనర్చి నిజధాత్రికిఁ బంచుట నీతి గాన మీ
కోరికపద్ధతిం దెలియఁ గోరితి నావుడు వార లీకొనన్.70
క. ఘనమతితో నప్పుడు క
ర్దనునిన్ రావించి నీదు రాజ్యమునకుఁ) బొ
మ్మనుమాట బ్రియ మొనర్చితి
వినుతాంబరభూషణాదివితరణములతోన్.71
వ. పదంపడి కనకరేఖచేత నతనికి నాక్రమంబును సాధకక్రూర
కర్మకౌశలంబును ముదితగాంధర్వపరిణయప్రకారంబును
జయసింహు నెడం జేసిన వైచిత్రియుం జెప్పి పుచ్చి కలపి
కొని యతనిం గళింగనగరంబున కనిచి రెండురాజ్యంబులు
నొక్కటిగాఁ బాలించి భవత్పాదోపకంఠసంవాససౌఖ్యంబు
దొఱకొనుతెఱంగు చింతించుచున్నంత సింహవర్మ సహా
యంబు గోరి పుత్తించినం జనుదెంచి మనోరథసిద్ధిం బొందితి
ననిన విని రాజహంసనందనుం డభినందించి.72
తే. మంత్రగుప్తు పరాక్రమమహిమ గుప్త
మయ్యు నియ్యెడఁ బ్రఖ్యాత మయ్యె ననుచు
విశ్రుతుని మోము చూచి నీవిధము చెప్పు
మనుడు నాతండు భక్తి ని ట్లనియెఁ బతికి.73
ఉ. ఏనును వింధ్యకాననమహిం గలయ న్నిను రోసి గ్రమ్మఱం
గా నొకచోట నూతిదరిఁ గన్నులనీళుల మోముఁ గప్పుచున్
హీనదశార్తు డేడెనిమిదేఁడుల ప్రాయమువాడు పెద్దయుం
దీనత నొంది నన్ గని యధీరత నిట్లని పల్కె వెక్కుచున్.74