పుట:దశకుమారచరిత్రము.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

247

ఉ. కానక కన్నకూతుఁ గడు గారవ మొప్పఁగ నేన దాది నై
     యేన సవిత్రి నై పెనిచి యిచ్చితి [1]నచ్చుగ వేదశాస్త్రవి
     ద్యానిధియైన విప్రునకు నాతఁడు పెండిలి యాడి పోయె నా
     ల్గేను సమంబు లై మగుడ నెన్నఁడు రాఁ డది కారణంబుగన్.67
ఉ. ఏను దదీయదేశమున కేఁగెద నాతనిఁ దోడితేర ని
     మ్మానినికన్యకాత్వము ప్రమాదముఁ బొందక యుండునట్లుగాఁ
     బూని సహాయమై నడపఁ బొందగు బంధులు లేరు గావున
     న్మానవనాథ! నీకడ సమర్పణ సేయఁ దలంచి వచ్చితిన్.68
చ. అనద మహీసురోత్తముఁ డనంతవయస్కుఁడ నీకృపావలో
     కనమున కేను బాత్రుడఁ బ్రకాశయశోధన! ధర్మవర్తనుం
     డనియెడు పేరు సార్థ మవునట్లున నిక్కమలాక్షిరక్షణం
     బొనరఁగఁ జేయు మే నతనియున్నెడకుం జని వచ్చునంతకున్.69
చ. అనవుడు సమ్మతించి నను నంతిపురంబున నింతిపిండులో
     జనపతి యుంచు నేను బలుచాయల మాయల బేలు వెట్టి య
     మ్మనుజగణేశు పుత్రి నవమాలిక వాసగృహంబు చొచ్చి యం
     దనుదినము న్మనోభవసుఖాంబుధిలోపల నోలలాడెదన్.70
వ. అనిన నతండునుం గపటవర్తనలంపటుండు గావునం బ్రీత
     చిత్తుం డై స్వీకృతకన్యకాకారుం డగు నన్నుం దోకొని చని
     మదుక్తప్రకారం బనుష్టించిన రాజానుమతంబున నేనును
     నంతఃపురంబు చొచ్చి యత్తెఱం గంతయు నవమాలిక కెఱిం

  1. నొక్కట