పుట:దశకుమారచరిత్రము.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాశ్వాసము

243

తే. నడచి డస్సినచంచ మాననమునందుఁ
     గాననయ్యెడు నీకు నేకతమ యిచట
     నేల తిరిగెదు రమ్ము మాయింటి కిష్ట
     సంపదలఁ బొద్దుపుత్త మచ్చటన మనము.46
చ. అని వినయంబుతో నిజగృహంబునకుం గరమర్థి నన్నుఁ దో
     కొని చని పేర్చునెయ్యమునకుం దగు మజ్జనభోజనాదివ
     ర్తన మొనరించి నెమ్మి నుచితంబగు మాటలఁ బ్రొద్దుపుచ్చి యొ
     య్యన ధవళాయతాక్షి వదనాంబుజ మించుక యుల్లసిల్లఁగన్.47
క. పలుచోట్లం గౌతుకమునఁ
     గలయం గ్రుమ్మరుట మీకుఁ గలుగును నిల నెం
     దుల నైన నద్భుతంబులు
     గలవే! మీ రెన్నఁడేనిఁ గన్నవి యనినన్.48
చ. అనవుడు దానిచిత్తగతమైన తలం పెఱుఁగం దలంచి యే
     నును మును గన్న చిత్రపటనూతనరూపముఁ బొంద రాజనం
     దన యనురాగలజ్జలకుఁ దావల మై వెడనిద్రవోవురూ
     పును లిఖియించి యాతలిరుఁబోఁడికి నేర్పడఁ జూపి చెప్పితిన్.49
క. ఈచందము సౌధముపై
     నీచందము పాన్పుమీఁద నీచందము వా
     రీచాడ్పున నొండొరువులఁ
     జూచుట గల నొక్కనాఁడు చూచితిఁ దరుణీ!50
క. అనవుడు నది యిది కల గా
     దనఘా! నిక్కంబు చెప్పు మనవుడు నే మున్