160
దశకుమారచరిత్రము
తే. మీగృహంబున నీధనమిత్రు నజిన
రత్న మున్నది దెలియ నారసి యెఱింగి
నిన్ను రాఁబంచితిమి నీవు నున్న రూప
మేర్పడఁగఁ జెప్పు మది మీకు నెట్లు సేరె?93
వ. అనిన విని యదియును దేవా! దేవర పిలిచి యడుగ బొంకు
పలుకుట ప్రాణగొడ్డంబు చర్మభస్త్రిక మా యొద్ద నునికిగల
దవధరింపు మని యి ట్లనియె.94
సీ. అన్నంబు వెట్టి తెక్కలిగొని యంకంబు
పలువురతో నాడి బందివట్టి
జూదంబునకుఁ జొచ్చి చూఱకాండ్రం గూడి
పరదేశముల కేఁగి తెరువు లడిచి
యాలి రో యిడి తల్లి నాఁగి బిడ్డల నమ్మి
కన్నతండ్రులతోడఁ గయ్య మాడి
రాజులఁ గొల్చి క్రూరంపుఁజెయ్వులు సేసి
లజ్జాభిమానంబు లుజ్జగించి
తే. ధనము లార్జించి మిండాటమునకుఁ జొచ్చి
యిచ్చఁ గ్రీడింతు రింతవ ట్లెఱిఁగి యెఱిఁగి
యజినరత్నంబు మీ కిచ్చినాతఁ డెవ్వఁ
డతని నెఱిఁగింపు మని నన్ను నడుగఁ దగునె.95
క. అనవుడు నది యగు నైనను
మన సెఱిఁగిన తెఱఁగు నీకు మా టిడఁగావ
చ్చునె చెప్పకున్నఁ ద ప్పని
మనుజాధిపుఁ డాజ్ఞ సేసె మాధవసేనన్.96
వ. ఆజఱభి భయంబు నటించుచు ని ట్లనియె.97