షష్ఠాశ్వాసము
145
వడయు నుపాయంబు సెప్పెద విను మని యిట్లనియె.12
క. వణిజులకు నొండె నొండెను
గణికలకుం గాని దీనఁ గాంచిన లాభం
బణుమాత్ర మైన నొరులకు
గణియింపఁగ రాదు వా రకల్మషబుద్ధిన్.13
సీ. ధర్మమార్గంబునం దడవినసొ మ్మెల్ల
ధరణీసురల కర్థి దాన మిచ్చి
యన్యాయమునఁ గొన్న యర్థంబు దమచేతఁ
గోల్పడ్డవారికె కోరి యిచ్చి
తొలుతగా నొకతీర్థజలములం బరిశుద్ధ
దేహు లై తగ నిష్ఠ దేవపూజ
లొనరించి నాఁ డెల్ల నుపవాసముగ నుండి
యజినరత్నమునకు నర్చ లిచ్చి
తే. యొండు దలఁపుఁ దలంపక నిండుమనము
తోడ నున్నంత మఱునాడు తోలుతి త్తి
లక్షధన మిచ్చుఁ బ్రథమకల్పమున కిదియ
తెఱఁగు నెలనెల నియతి మై మఱియుఁ గోరి.14
క. వ్యయ మై మిగిలిన ధనములు
దయ భూసురకోటి కిచ్చి తా రవని గుశా
శయనమున నున్న నాల
క్షయుఁ దప్పక యిచ్చుచుండు శాశ్వతవృత్తిన్.15
తే. అని కృపారసపరిపూరితాత్ముఁ డగుచు
నన్నుఁ గనుఁగొని వెండియు నమ్మఁ బలికి