పుట:దశకుమారచరిత్రము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

119

     భావనుఁ డైన యొక్కరునిపాలికి లోలతఁ బోవ వచ్చినం
     బోవకు మంటి నావుడుఁ దపోవనభూమికి వచ్చెఁ జెచ్చెరన్.18
తే. తపము వడయుదు నని వెఱ్ఱితనము మిగిలి
     వినదు నామాట దేవ! నీ వనునయించి
     యెన్ని భంగులనైన [1][ను హితము సెప్పి
     కూఁతు నింటికిఁ బంపి మాకులము నిలుపు.19
మ. అని దైన్యంబున వేశ్యమాత మిగులం బ్రార్థింప నార్ద్రాత్ముఁడై
     వనవాసంబునఁ గష్టముం దపము సాఫల్యంబునుం జెప్పి జ
     వ్వని నవ్వేశ్య బహుప్రకారముల నిర్బంధించి పొమ్మన్న న
     మ్మునివాక్యంబుల నాలకించి యనియెం బూఁబోఁడి నారూఢిగన్.20
క. దేవా! మీపదసేవను
     భావించియ వచ్చియుంటి వలదని యనుచో
     బావకుఁడే శరణం బగుఁ
     దావక సన్నిధిన] యింత తథ్యము సుమ్మీ!21
వ. అనిన విని యొం డెట్టియుం బలుకనేరక దానితల్లి మొగంబు
     గనుంగొని యమ్ముని యిట్లనియె.22
ఉ. కోపము పొంగుఁ గ్రుంగు నొకకొన్నిదినంబులు కాననాంతర
     వ్యాపితఖేద మొందిన నవశ్యము నంత ననంతదుఃఖసం
     తాపిత యై తుదిం దెలిసి తాన మదిం దలపోసి చూచి ని

  1. ఇచట కుండలీకరణము చేయఁబడిన భాగము వ్రాఁతప్రతిలో లేకుండుటంకేసి యీషన్మూలాధారముతోఁ గథాసందర్భమునఁ బూరింపఁబడినది.