పుట:దశకుమారచరిత్రము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

95

     వృత్త మమాత్యుచేత విని విస్మయమంది కులంబు శీలమున్
     జిత్త మెలర్పఁగా నతఁడు చెప్ప నెఱింగి మనోముదంబునన్.34
ఆ. మంత్రిబాంధవానుమతి శుభ దినమునఁ
     బుణ్యవేళ నతివిభూతి వెలయఁ
     దనతనూజ నాకుఁ దగఁ బెండ్లి చేసి భూ
     జనులు వినుతి సేయ మనుజవిభుఁడు.35
వ. ఏనునుం బ్రతిదినం బతనిచిత్తం బారాధించి యువరాజ్యాభి
     షిక్తుండ నై వివిధసుఖంబు లనుభవించుచుండి భవద్విరహ
     వేదనాశల్యహృదయుండ నై వర్తిల్లుచు నొక్కసిద్ధముని
     యాదేశంబున నభిమతజనావలోకనఫలంబగు పూజావిశే
     షంబున మహాకాళనివాసుండగు పరమేశ్వరు నారాధించు
     టకు నేఁడు పత్నీసహితం బిటు వచ్చి భక్తవత్సలుండగు
     నద్దేవుని కారుణ్యంబున భవదీయపాదారవిందసందర్శనానం
     దంబు వడసి కృతార్థుండ నైతి ననిన విని రాజవాహనుండు
     మోదమానమానసుం డై నిరపరాధచండంబునకు విధి
     నిందించి వయస్యుపరాక్రమం బభినందించి యాతనికి నాత్మ
     వృత్తాంతంబును బుష్పోద్భవుచరితంబునుం గ్రమంబునఁ
     జెప్పె నయ్యవసరంబున.36
క. ధరణీసురుఁ డొక్కరుఁడు చ
     తురవేషోపేతుఁ డచటఁ దోతెంచి మహీ
     వరు నాశీర్వాదపుర
     స్సరముగఁ గాంచుటయు నధికసంప్రీతిమెయిన్37