పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

63

జరిగినపిదప ఆర్జిత బ్రహ్మో త్సవ గృహస్థులకు శ్రీ విచారణ కర్తలవారును, ఉద్యోగస్థులలో సేష్కార్, పారుపత్యదార్ మొదలగువారు యుండి సంకల్పయక్తముగ దత్తముచేయించి శ్రీమూలవరుల ననుమతికొఱకు సన్నిద్ధికి వెళ్లి అచ్చట నుండి మం!తముతో అర్చకులు బలిసాయించుచు ఉత్సవ మూర్తికి ముందుగ వెళ్లెదరు. ఇట్లు నాలుగువీధులు ఉత్సవమైన తఱువాత ధ్వజపటమునకు ధ్వజస్థభమువద్ద ప్రజజరిగినివేదనై స్థంభము పై నెక్కించేదరు. తిరుమలరాయమంటసములో ఆస్థానమై శ్రీవారు లోపలకు దయచేసిన తఱువాత రెండవఘంటయైనవెంటనె తోమాల సేవ, ఆర్చిన రాత్రిఘంట అయి శ్రీవారికి పెద్ద శేషవాహనోత్సవమగును.ఉత్సవమై ఆస్థానానంతరము శ్రీవారులో పలకు దయచేసిన తఱువాత తీర్మానమై తలుపులు వేయఁబడును.

రెండవదిసము._____

1 మధ్యాహ్నము మొదటిఘంట అయిన తఱువాత చిన్న శేషవాహనము.

2 రాత్రి నివేదనఘంటఅయినతఱువాత హంసవాహనము. నిన్న మొదలు 9 దివసములు దినముకు ఒక ధర్మదర్శము మాత్రముండును.

మూడవదివసము.____

1 సగలు సింహవాహనము.

2 రాత్రి ముత్యపుపందిలి అనే వాహనము. (తాయారులు సయితము).