పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0348-01 దేవక్రియసం: 04-279 రామ


పల్లవి :

ఏమి చెప్పేది ప్రతాప మెట్టి విలుకాఁ డితఁడు
రాముఁడు వీఁడే మ్రొక్కుఁడు రణరంగధీరుఁడు


చ. 1:

విడిసెఁ గపిబలము వెస సముద్రము దరి
నడచె లంకపైఁ బౌఁజు నానాగతుల
తొడిగె రాముఁడు వింట దొనలోని బ్రహ్మాస్త్రము
పడే రావణుతలలు పంక్తులై ధరణిని


చ. 1:

చొచ్చిరి లంకలోను సుగ్రీవాంగదాదులు
తెచ్చిరి రాకాసి చెర తెప్పలుగాను
యిచ్చిరి జయధ్వనులు యింద్రాదిదేవతలు
మెచ్చిరందరు సీతాసమేతుఁడాయ నితఁడు


చ. 1:

మగుడెఁ బుష్పకముపై మహిమ నీతనిదండు
తగఁ బట్టము తా నేలె తమ్ములతోను
అగపడి శ్రీవేంకటాద్రిపై నిల్చె నితఁడు
జగదేకమూర్తి కౌసల్యాసుతుఁ డిపుడు