ఈ పుట ఆమోదించబడ్డది
రేకు: 0012-01 బౌళి సం: 01-072 వైరాగ్య చింత
పల్లవి: పరదేశిపట్టణమున పదుగురు నేగురుఁ గూడుక
పరగఁగ వరి చెడ నూదర బలిసినయట్లాయ
చ. 1: ఊరేలెడియతఁ డలసత నూరకయుండఁగ నడుముల-
వారలు నిక్కపుగర్తలవలె నుండినగతిని
ధీరత చెడి తను జీవుఁడు దెలియఁగనేరక యుండిన
ధారుణిలోపల దొంగల ధర్మాసనమాయ
చ. 2: వొడలంతంతకుఁ జిక్కఁగ నుబ్బినరోగము సుఖమున-
కెడమియ్యక నానాఁటికి నేఁచిన చందమున
తడఁబడువిజ్ఞానము గతిదప్పఁగ బలుపగుపట్నము
కడుఁజెడఁగా, మాలవాడ ఘనమైనట్లయ
చ. 3: పొసఁగఁగ నిది గని యధికుడు పుక్కట కాండ్ల నందరిఁ
బసమారిచి మొదలికర్తఁ బాలించినగతిని
పసగలతిరువేంకటగిరిపతి నాదేహపుఁబురి నీ-
వసమై వెన్నకు బండ్లు వచ్చినయట్లాయ