ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఉ. | ఎవ్వరు లేరు జీవునికి, నెవ్వరు శత్రువు? లెవ్వ రాప్తులున్ | 94 |
భావం:
దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! చిత్తగింపుము! ఎన్నిరీతుల ఆలోచించి చూచినా, ఈ జీవుడే అందరిలోనూ నిండియున్నాడు గనుక, ఈ జీవునికి ఎవరూ శత్రువులు కారు; ఎవరూ మిత్రులు కారు. అలాగే, ఈ జీవుణ్ణి నిందించేవారుగానీ, ప్రశంసించేవారు గానీ ఎవ్వరూ లేరు. యథార్థ మిదిగా ఉండగా, ఒక్కొక్క మనుష్యుడు “నీవు నేను”- అనే భేదభావంతో అహంకరించి, సతమతం అవుతూవుండడం దేనికి? (తత్త్వం ఎఱిగిన జ్ఞానికి సర్వం భగవత్ స్వరూపమే కాబట్టి, అలాంటి భేదభావన తగదని తాత్పర్యం.)