Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రుండును చేకితానుండును గృతవర్మయు నాదిగాఁ గల
యాదవవీరులు భీష్మద్రోణకృపాశ్వత్థామల మున్నిడు
కొని పశ్చాద్భాగంబునం కొలిచి యేతేర ఘటోత్కచాది
రాక్షసవీరులు తమతమబలంబులతోడఁ బిఱుందరా వామ
దక్షిణభాగంబుల సామజంబు లెక్కి వచ్చు రామకృష్ణుల
తోడ నుచితాలాపంబు లాడుచుఁ బౌరపుణ్యాంగనలు రమ్య
హర్మ్యాగ్రములనుండి మంగళపల్లవలాజపుష్పంబులు చల్లి
దీవింప భూసురాశీర్వాదనాదంబును మంగళపాఠకగీతరవం
బును వందిమాగధజయధ్వానంబునుం జెలంగఁ గుంజర
ఘంటానినాదంబులు రోదోంతరాళంబు నిండ విజయభేరీ
మృదంగకాహళవేణుశంఖతమ్మటమురజఢక్క
హుడుక్కాదినానావిధవాజ్యధ్వానంబులు లోకాలోక
పర్వతంబున ప్రతిశబ్ధంబు నిగిడింప నైరావతారూఢుండైన
దేవతాసార్వభౌముచందంబునం ప్రవేశంబు చేసె నంతక
మున్న యాయతంబు లయిన హర్మ్యప్రాసారంబుల బల
భద్రపుండరీకాదులు నానాదేశాగతరాజన్యులను భీష్మా
దులను విడియ నియమిుంచి యక్రూరుమందిరంబున ననుజ
సమేతుండైన యజాతశత్రు నుంచి యఖిలబలంబులకు సకల
పదార్థంబు లొసంగుచుఁ గతిపయదినంబులు నిల్పి యొక్క
నాఁడు కృష్ణుం డుగ్రసేనశూరసేనవసుదేవపురస్సరంబు
గా భీష్మద్రోణాదిమాన్యులకును యుధిష్ఠిరాదిపాండ
వేయులకును సుయోధనాదిగాంధారేయులకును రాధే
యాదిమహాయోధవీరులకును ద్రుపదవిరాటాదినానా
దేశాధీశ్వరులకును ఘటోత్కచాలంబుసహలాయుధాది