డగుపుండరీకాక్షుని యక్షీణప్రభావంబునకు సమందానంద
కందళిత హృదయులై పురందరాదిబృందారకులు మందా
రాభినవప్రసూనవర్షంబులు గురియించిరి సిద్ధవిద్యాధరా
దులును గిన్నరకింపురుషాప్సరోజనంబులును గీతనృత్య
వాద్యంబుల సంతసించి రట్టియెడ సుయోధనాదిధార్త
రాష్ట్రులును యుధిష్ఠిరాదిపాండవేయులును ద్రుపదవిరా
టాదినానాదేశాధీశ్వరులును గాంగేయుండు మున్నుగాఁ
దమతమసైన్యంబులు గొలువ నరుగుదెంచి రథంబులు డిగ్గి
యద్దేవునకుఁ గృతప్రణాములై నిలిచి యనంతరంబ
విజ్ఞాననిధి యగు నా దేవవ్రతుండు కృతాంజలియై యిట్లని
స్తుతించె.