Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డగుపుండరీకాక్షుని యక్షీణప్రభావంబునకు సమందానంద
కందళిత హృదయులై పురందరాదిబృందారకులు మందా
రాభినవప్రసూనవర్షంబులు గురియించిరి సిద్ధవిద్యాధరా
దులును గిన్నరకింపురుషాప్సరోజనంబులును గీతనృత్య
వాద్యంబుల సంతసించి రట్టియెడ సుయోధనాదిధార్త
రాష్ట్రులును యుధిష్ఠిరాదిపాండవేయులును ద్రుపదవిరా
టాదినానాదేశాధీశ్వరులును గాంగేయుండు మున్నుగాఁ
దమతమసైన్యంబులు గొలువ నరుగుదెంచి రథంబులు డిగ్గి
యద్దేవునకుఁ గృతప్రణాములై నిలిచి యనంతరంబ
విజ్ఞాననిధి యగు నా దేవవ్రతుండు కృతాంజలియై యిట్లని
స్తుతించె.

123


దండకము.

శ్రీ కామినీమానసాంభోజమిత్రాదళత్పద్మనేత్రా
రిపువ్రాతజైత్రా మునిస్తోత్రపాత్రా సదానందయోగీంద్ర
సన్మానసారామచైత్రా మహాఘౌఘవల్లీలవిత్రా జగజ్జాల
రక్షావిధాదక్షదక్షాత్మజానాథవంద్యా సముద్రంబులన్
బుద్బుదవ్రాత ముద్భూతమై పొల్చి తన్నీరమధ్యంబునన్
లీనమైపోవురీతిన్ సరోజాతగర్భాండముల్ నీప్రభావం
బుచే నుద్భవించున్ జెలంగున్ మడంగున్ ముకుందా
భవద్రోమకూపంబులం దత్పయోజాతగర్భాండసంఘంబు
వాతాయనాయాత యాతాణుజాతం బనన్ బొల్చు నం
దొక్కబ్రహ్మాండమధ్యంబునన్ రాజసుల్ తామసుల్ సోమ
రుద్రాజముఖ్యుల్ జగన్నాయకా తావకానంతకళ్యాణ
లీలాగుణశ్రేణిలో నొక్కఁడైనన్ యథార్థంబుగా బుద్ధి
నీక్షించి వర్ణింపఁగా శక్తుఁడే భక్తవశ్యా పయఃపూరసం
పూరితానేకకుంభాంతరద్యోతమానేందుబింబాకృతిన్