Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యైన కృష్ణతనూభవు లతని మెదలఁ
గదలరాకుండ నేసి రాగ్రహము నిగుడ.

47


తే.

అప్పు డాసవ్యసాచియు హరకరాగ్ర
దీప్తశూలంబుగతి మించుదివ్యశరము
నారి సంధించి వేయ నానావిధముల
నతివిచిత్రంబుగా నొంచె నారథికుల.

48


వ.

ఇవ్విధంబున నర్జునుండు హరికుమారుల నిశ్శేషంబుగా వధి
యించిన దుర్యోధనప్రముఖయోధులు హతశేషబలం
బును జలంబునఁ జంపి రంత నిట రామకృష్ణులు సాత్యకి
దారకులు సేయు శిశిరోపచారంబులవలన మూర్ఛందేఱి
ఖండంబులైన శుండాలంబులును నొరఁగిన తురంగంబులును
బఱియలైన యరదంబులుం గూలిన కాలుబలంబును
మ్రగ్గిన కుమారవర్గంబునుం గలిగి నిర్మనుష్యంబైన
యాత్మసైన్యంబుఁ జూచి శోకవ్యాకులితమనస్కులై
రయ్యవసరంబున.

49


సీ.

సంవర్తచండభాస్కరమండలంబు నా
             నాస్యంబు భీకరంబై వెలుంగఁ
గల్పాంతవిస్ఫులింగంబు లొక్కుమ్మడి
             నిగిడె నాఁ గన్ను అనిప్పు బుగులఁ
బ్రళయకాలోగ్రనిర్భరసింహనాదంబు
             నాఁ బాంచజన్యస్వనంబు నిగుడఁ
గల్పాంతసమయమేఘవ్రాతనిర్దోష
             మన శార్ఙ్గగుణరావ మగ్గలింపఁ