Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కచ్చపంబును దలయెత్తఁ గానదయ్యెఁ
గ్రోడమును నిల్వనోపక కొమ్ము వంచె.

30


వ.

ఇవ్విధంబున బంధుభ్రాతృపుత్త్రమిత్రాదిజనంబులు పరి
వేష్ఠించి కొలువ శమంతపంచకంబునకుం జనుదెంచి
యంతకమున్న పన్నినం గనుపట్టు పట్టాంశుకవిరచితాభ్యం
తరనివాసంబులును, నీలపటకల్పితానల్పకుంజరశాల
లును, ధవళాంబరకృతమందురలును, చిత్రచేలనిర్మితంబు
లగు గుడారంబులును, విలసిల్లు నిజశిబిరంబు గోధూళికా
లగ్నంబునం బ్రవేశించి సాత్యకి ప్రదుమ్నానిరుద్ధాదుల
నయ్యైఠావుల నుండ నియమించి బలభద్రాదుల నుచిత
స్థానంబుల కనిపి రథంబు డిగ్గి యభ్యంతరంబున కరిగి.

31


తే.

నలిననేత్రుండు పన్నీట జలకమాడి
వస్త్రభూషణమాల్యముల్ వరుసఁ దాల్చి
బుధులతోఁ గూడి సంధ్యాదివిధులు దీర్చి
యన్నపానాదికృత్యంబు లాచరించి.

32


క.

అరవిరిపూఁబానుపుపై
మురాంతకుఁడు పవ్వళించె ముద్దియ లడుగుల్
పరిపరిలాగుల నొత్తఁగ
మరువపుసురటీలు వీవ మది ముద మొదవన్.

33


వ.

అనవుడు నుదారస్వాంతుండగు నిలావంతుండు హరి
గుణానురాగియగు శుకయోగి కిట్లనియె.

34


క.

హరి యివ్విధమున సేనా
పరికరములతో శమంతపంచకమునకుం
ద్వరితముగ వచ్చినంతట
హరిసూనుం డేమి చేసె నానతి యీవే.

35