Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వానీకము నను మెచ్చఁగ
నానాశస్త్రాస్త్రముల రణస్థలి ననినన్.

180


వ.

భీష్ముం డిట్లనియె.

181


తే.

అనఘ, నీమాట యట్టిదయగు నిజంబు
వినుము వీరల నెల్లఁ గాదనుట గాదు
సకలవైరులయని యొక్కచంద మంబు
జోదరునితోడ రణము వేఱొక్కవిధము.

182


వ.

కావున నీచతుర్ధనుం గావను గృష్ణున కెదురించను నీవ
సమర్థుండవు. నీపిఱుందన యుధిష్ఠిర దుర్యోధన దుశ్శాసన
శకుని సైంధవ ద్రుపద విరాట ఘటోత్కచులును ధృష్ట
కేతుండును సుదక్షిణ పాండ్య భగదత్తులును గేకయు
లేవురును నీలుండును రుక్మియు కల్యుండును విందాను
విందులును గూడఁ బదునెనమండ్రు, నక్షౌహిణీపతు లయ్యె
దరు. వీరలు నేనును గురు కృపాశ్వత్థామ కర్ణ బాహ్లిక
సోమదత్త భూరిశ్రవులుం దక్కినయోధవీరులును సంగ
రంబున నీచెప్పినరీతిన తిరిగెద మనిన నయ్యర్జునుం డియ్య
కొని నాకు సారథియుం జక్రరక్షకులును మహాయోధులు
గావలయు ననిన నతండు మిగుల విచారించి యశ్మంతకు
నక్షౌహిణీపతిత్వంబునకు నియమించి శల్యు సారథ్యంబు
నకు నియ్యకొలిపి చక్రరక్షకత్వంబునకు నొడంబఱచిన
నుత్తమోజుండును యుథామన్యుండును నట్ల గాక యని
రంత.

183


తే.

ఉత్తమంబైన యభిజిన్ముహూర్తమునను
భూసురాశీర్నినాదంబు బోరుకొనఁగ