Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నియమించిన వారలకు నప్పురంబునుం దన్మహోద్యాన
ప్రాంగణప్రదేశంబునుఁ బట్టుచాలక క్రిక్కిఱిసి యుండె
నంత.

40


తే.

పాండవులుఁ గౌరవులు సర్వపార్థివులును
హస్తిపురమునఁ గూడుట యాప్తచరులు
దనకు వినిపింపఁ గృష్ణుఁ డుద్ధవునిఁ బిలువ
నంపి యాతనితోడ నిట్లనుచుఁ బలికె.

41


క.

కలియును నూనెయు బలె మును
గలయక క్షీరోదకముల కరణిం గౌంతే
యులుఁ గౌరవు లిపు డెనసి స
కలనృపులను గూర్చినారు కరినగరమునన్.

42


వ.

అందు.

43


తే.

పాండవులు నాకు నొక్కింతపనియుఁ జెప్పి
కాని చేయరు నేఁ డిట్టికార్య మెత్తి
యెఱుఁగ వినిపింప రిందుల కేనెపంబొ
చిత్ర మయ్యెడి బుద్ధి నీక్షించి చెపుము.

44


వ.

అనవుడుఁ గృష్ణున కుద్ధవుం డిట్లనియె.

45


తే.

మనము బంధుల మీధరామండలమునఁ
గలుగు నృపులును వారినే కలిసినారు
రిపుఁ డొకండును లేఁడు తర్కించి చూడ
నింక నొకమాట వినుమని యిట్టు లనియె.

46


సీ.

ఈధృతరాష్ట్రుపై నాధృతరాష్ట్రుండు
             వచ్చెనో పన్నగ[1]వైరిఁ గూడి

  1. వరులఁ