Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాయరానట్టి చెలిమి సౌభ్రాత్రమహిమఁ
జెంగలింతురు నరసింగరంగఘనులు.

44


ఉ.

వారలలోన నగ్రజుఁ డవారితశౌర్యధురంధరుండు ది
గ్వారణదంతసంకలిత[1]భద్రయశోవిభవుండు దీనమం
దారుఁడు సంగరస్థలవిచారితశాత్రవుఁ డంగనామనో
హారుఁడు నారసింహసచివాగ్రణి మించు వసుంధరాస్థలిన్.

45


ఉ.

 సాగరయక్షరాజజలజాతహితాత్మజ[2]వారివాహతా
రాగణనాథులం దెలియరాక కవుల్ నెఱదాతలందు రా
యేగురి దానసంపదలు నేగుఱి సంతతభోగవైభవ
శ్రీగుణశాలి నారయనృసింహునిత్యాగముఁ బేరుకొన్నచోన్.

46


సీ.

పట్టించె వేడ్క సద్వైష్ణవబ్రాహ్మణ
             యాచకతతికి నానార్థములను
మట్టించెఁ గలన సామ్రాణితేజీలచే
             మత్తారిరాజన్యమస్తకములఁ
బెట్టించె నెడరైన పృథ్వీస్థలంబుల
             ధర్మసత్రంబు లుద్యానములును
గట్టించె నమృతాంశుకంజాప్తతారక
             స్థితి మీఱఁ జెఱువులు దేవళములు


తే.

నాతఁ డెన్ములపల్లివంశాంబురాశి
తోషకరనిత్యపరిపూర్ణతుహినకరుఁడు
దనరు సర్వంసహాధీశదండనాథ
మకుటమణియైన నరసింగమంత్రివరుఁడు.

47
  1. కమ్ర
  2. మేఘవాహ