Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

అది వీక్షించి బలానుజుండు పటుకోపాయత్తుఁడై యుగ్రతం
బెద వల్లాడఁగఁ గన్నుదోయి యరుణస్ఫీతాకృతిన్ మీఱ ను
న్మదుఁడై యెవ్వనిఘోటకాననజఫేనం బీగతిన్ వచ్చె వా
ని దివౌకస్పతి గాచినం దునుముదు న్వేమాసమాత్రంబునన్.

63


ఆ.

అని ప్రతిజ్ఞఁ జేసి యనుపమసంతోష
భరితుఁ డగుచు నాత్మపురికి నేఁగి
యున్నవాఁడు భుజము లున్నతాకృతిఁ బొంద
ననఘ దేహరక్ష యరసికొనుము.

64


వ.

ఇవ్విధంబున నాకైలాటకంబుదపసి వేఁడినారసంబులు గర్ణం
బులఁ జొనిపినచందంబున నమ్ముకుందప్రతిజ్ఞాప్రకా
రంబు వినిపించి యథేచ్ఛం జనియె నిటఁ జతుర్ధనుండును
భయాక్రాంతుండై తనలో నిట్లని చింతించె.

65


ఉ.

ఏటికి వేఁటఁ బోయి తఁట నేటికి మాయపుఁదేజిఁ గంటి? నే
నేటికి దానిఁ బట్టికొన నేటికి నెక్కితి నిత్తెఱంగు నా
కేటికి వచ్చె నివ్విధికి నెవ్వనిపాదము పట్టికొందు నీ
వేఁటయు నన్నుఁ బాండుపృథివీపతిభంగిఁ గలంచె దైవమా.

66


సీ.

అని వెచ్చనూర్చి ధైర్యంబూఁత గాఁగ న
             మ్మనుజాధినాథుఁ డిట్లని తలంచె
నత్యంతచంచలం బైనప్రాణముతీపిఁ
             గులశీలధర్మముల్ గుందుపఱిచి
సరియైన మేదినీశ్వరులు నవ్వఁగ బాంధ
             వులు సిగ్గుపెంపునఁ దలలు వంప
గులహీను గుణశూన్యు గోపాలు మాయి కృ
             తప్రతిజ్ఞుని నెవ్విధమున శరణు