Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

నారదుఁ డేగుదెంచి నరనాథునిముందట నిల్చె వేడుకల్
దేరఁగ గాడ్పుచేత మహతీవరతంత్రులు విష్ణు కృష్ణ నీ
రేరుహనేత్ర భూమిధర శ్రీధర యచ్యుత రుక్మిణీమనో
హార ముకుంద కేశవ జనార్దన యంచుఁ జెలంగి మ్రోయఁగన్.

44


వ.

ఇవ్విధంబున సకలవిద్యావిశారదుండును నిజతనుప్రభా
విజితశారదనారదుండును నగునారదుండు వచ్చిన నాచతు
ర్దనుండు నిజపరిజనసహితంబుగాఁ బ్రత్యుత్థానంబుఁ జేసి
తనకిరీటం బతని పాదాగ్రంబులు మోప సాష్టాంగం బెఱఁగి
యమ్మహామౌని పాదరేఖలు దనమందిరం బలంకరింప నడ
పించి సుఖాసీనుం గావించి యాతిథ్యం బొనరించి కృతాం
జలియై యిట్లనియె.

45


చ.

మునివర, యెల్లకాలమును మ్రొక్కులచే నినుఁ బూజ సేయునా
యనిమిషనాథు నింటికి నొకప్పుడు పండువు రీతి వట్టి నీ
వ వనుఁ గృతార్థుఁ జేసి విభవంబులు నా కొనఁగూర్చుకారణం
బునఁ జనుదెంచి తిచ్చటికిఁ బుణ్యుఁడ నైతిఁగదా జగంబునన్.

46


వ.

అనిన నమ్మహీధవునకుం గలహభోజనుం డిట్లనియె.

47


తే.

భద్రమే నీకు రాజేంద్ర, ప్రజల కెల్లఁ
గుశలమే నీవు పాలించుక్షోణితలము
సత్యసంపదచేతఁ బ్రశస్తమగునె
పరిజనంబులకెల్ల శోభనమె చెపుమ.

48


పరికించి పనులవారలఁ
దరబడి పదములను నిల్పు దానికి రాజ్య
స్ఫురణ దగ మేన సకలా
భరణంబులరీతి వీడుపడకుండ నృపా.

49