Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఆ చతుర్ధనజననాయకుం డద్దేవదేవుసభామంటపంబున సన
కసనందనాదులం గనుంగొని వినమితశిరస్కుండై పురో
భాగంబున.

135


తే.

శ్రీహరికి నాత్మభోగ మర్పించి శాంత
మూర్తియై పెక్కుభంగుల మొనసి సేవ
సేయు పన్నగరాజు నీక్షించి యమ్మ
హీవరుఁడు నాతనికి నమస్కృతులు చేసి.

136


వ.

తదనంతరంబ.

137


సీ.

తనతల్లి దాస్యంబు దప్పింప హరి నోర్చి
             యమృతంబుఁ దెచ్చిన యధికుఁ డితఁడు
క్ష్మాధరంబులఁ బోలు గజకచ్ఛపంబులఁ
             గబళించి మ్రింగిన ఘనుఁ డితండు
బ్రహ్మాండసంఘధురంధరుం డగు విష్ణు
             నవలీలఁ దాల్చు మహాత్ముఁ డితఁడు
సకలవేదములు శాస్త్రములు సంగములుగా
             జనన మొందిన పుణ్యచరితుఁ డితఁడు


తే.

పాపరాయని మదిలోని భయము మాన
శాంతిఁ ద్రిమ్మరు పాపభంజనుఁ డితండు
అనుచు నారాజశేఖరుఁ డహివిరోధిఁ
గని నుతుల్ చేసె క్షేమంబు గడలుకొనఁగ.

138


శా.

విష్వద్ర్యఙ్మహనీయకీర్తిఁ ద్రిజగద్విఖ్యాతచారిత్రుఁ డీ
వ్యేష్వాసోజ్జ్వలహస్తు సర్వరిపువాహిన్యంధకారార్కునిన్
విష్వక్సేనపదాంబుజార్చనవిధావిజ్ఞానపారీణు న
విష్వక్సేనునిఁ జూచి మ్రొక్కె నిఖలోర్వీభర్త సంప్రీతితోన్.

139