Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిత్యాలయంబగు సత్యలోకముఁ జేర
             నరిగి నేత్రానంద మావహిల్లఁ


తే.

జారుమాణిక్యకీలితసౌధయూధ
వారిజోత్పలరుచిరకాసారవార
సతతఫలభారనతపారిజాతజాత
భూషితంబగు నొకమహాపురవరంబు.

111


క.

వీక్షించి యందు నృపహ
ర్యక్షుం డైందవశిలామయంబును మణిసం
లక్షితవేదీయుతమ
ధ్యక్షోణియు నైనయొక్కహర్మ్యములోనన్.

112


సీ.

ఎల్లదివ్యులకు మునీంద్రసంఘములకు
             మొదలై చెలంగెడు మూలదుంప
పాలు నీరును వేరుపఱుప నేర్చినయట్టి
             యంచతేజీ నెక్కి యాడురౌతు
పని లేనిపని కైనఁ బాఱి కైలాటకం
             బులు సేయుమునిఁగన్న ప్రోడవేల్పు
దొడ్డ కొంచెము లేక తుది నెట్టివరమైన
             జనవున నిచ్చు జన్యాళికాఁడు


తే.

వెలఁది తనతలవాకిలి వెడలనీక
పలుకులోపల నడపించుసాటి జాణ
బొడ్డుతామరపువ్వునఁ బొడమినట్టి
[1]ముద్దుపాపఁడు నాలుగుమోములాఁడు.

113
  1. ముదుకలాగుల