Jump to content

పుట:క్రీడాభిరామము (ఎమెస్కో).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

LXXXI

కాలములయందతి పుట్టుక, జాతి ప్రకారములు వివరింపఁబడినవి. గంధర్వకన్య యగు కమలపాణి, ఎప్పుడు ఓరుగల్లున మధుమావతి నామమున వెలయుచున్నది. ఇంక ముందు దక్షారామమున సత్ జాతీయందు సానికూఁతురై పుట్టి, చిన్నిపోత నామము దాల్చి, చిర కాలమునకు నందలి శివుని గూడి యుండఁగలదు- అను ప్రకరణమున చిన్నిపోతి వేళ్య కులమున జన్మించియు, 'నత్ స్త్రీ జాతి' యని యామె జాతిని అభివర్ణించుట యెట్టిదో యస్పష్ట విషయమై యున్నది.

వ్రాత ప్రతిలో "అప్సరస్ స్త్రీ జాతి యా సాని కూఁతురు"" అను పాఠము కన్పట్టుచున్నది. దక్షారామ మందలి పాను లందు భీమేశ్వరుని గొలువ వచ్చిన యచ్చెర మచ్చెకంటు అని భీమఖండము వలన స్పష్టపడుచున్నది:

ఎ గీ. సంభవించిరి గంధర్వ జాతి పనినఁ గలితనం బేల పెన్నాటకంబు సేయ నవఁగ, భీమేశ్వరుని గొల్తు ర ప్పురమున పానులను 'పేరి యప్సర శ్చంద్రముఖులు (శ్రీమేశ్వర - 1-88)

ప. 265 (1) త ద్విజుం డా తౌత్తుఁ బ్రా-తఃకాలమునఁ జూచి (2) దాని నా ద్విజుఁడు ప్రాతఃకాలమునఁ జూచి

మొదటి పాఠము వ్రాఁతప్రతిలోనిది. ఇందును వర్ణాధిక్యము చే ఛందో భంగ రోష మేర్పడినది. వ. 82 (1) కండుక కేళి సల్పెడు ప్రకారమునన్ (2) కందుక కేళి సల్పెడు ప్రకారమునన్

మొదటి పాఠము పూర్వ ముద్రిత ప్రతులయందలిది. రెండవ పాఠము వ్రాఁతప్రతి లోనిది. ఇందు 'దండ' ప్రాసము కన్పట్టు చున్నది. ముద్రితమై యుండు 'శ్రీనాథుని వీథి' యనఁబడు చాటు పద్య సంకలన గ్రంథము నందును ఈ 'ద-డ* ప్రాపమే