2
పద్మభవురాణి వల్లకీపాణి వాణి
సామినేని నృసింహుని సాకుఁగాత.
శా. జోహారంచు భజింతు నాత్మ విలసచ్చుభ్రాంశుభూషుం దుషా
రాహార్యేంద్రసుతాతనూభవు మదేభాస్యు న్సురస్తుత్యుఁ బ్ర
త్యూహధ్వాంతసభోమణి న్గణసనాథు న్విఘ్ననాథు న్మహో
త్సాహం బొప్పఁగ సామినేనికులజుం సాకన్నృసింహాహ్వయున్.
ఉ. చిత్రములైన మోములు నశేషవిభాతిశయప్రభా లస
ద్గాత్రము జారు బాహువులు గల్గి తలన్ శశిరేఖ వెల్గ లో
కత్రయపూజ్య భక్తజనకల్పకవల్లియునై తనర్చు గా
యత్రిపదంబులం దలఁతు నాత్మఁ గృతీశు మహేశుఁ జేయఁగన్.
ఉ. ఆది నొకండుగా వెలయు నాగమము ల్విభజించి యంత న
ష్టాదశసత్పురాణములు స్కాందముఖంబులు జేసి లోకర
క్షాదరణంబుతోడ వనజాక్షుఁ డన న్బ్రభగాంచినట్టి వి
ద్యాదయితు న్బరాశరమహామునినాథసుతు న్భజించెదన్.
గీ. మ్రొక్కి వల్మీకభవుపదంబులకు భక్తిఁ
గాళిదాసుకవిత్వవిక్రమముఁ బొగడి
నన్నపార్యాదికవికీర్తి సన్నుతించి
వరుస సేవింతు నాంధ్రగీర్వాణకవుల.
క. నతిజేయుదు ననుఁ గొమరుని
గతిఁ జూచుచు నెనరుమీర గా నురువిద్యా
న్వితుఁ జేసినట్టి సుగుణక
లితమతి కివటూరి నాగలింగార్యునకున్.
వ. అని కృతిముఖోచితవర్ణంబు గావించి మదన్వయక్రమం బించుక వర్ణించెద.
సీ. ఆత్రేయగోత్ర విఖ్యాతమౌ మధిరవం
శాబ్ధి జన్మించె సుబ్బయ్యసూరి
అతనికి సుతులు సుబ్బయ్య గోవిందయ్య
యనఁగ నిద్దరు పుట్టి రమలకీర్తు