పుట:కాశీమజిలీకథలు-05.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

23

    ద్వైతము నిల్పుటల్ దెలుపుఁ దత్కుచకుంభయుగంబుగౌరవ
    త్యాతిశయంబుచే నొకటియైగతమధ్యగతావకాశమై.

ఉ. చారుపయోధరాద్రివిల సద్రుచిళైవలినింజనించి చె
     న్నా రెడునాచునాఁదనరు నాసరసీరుహపత్రనేత్ర నూ
     గారువిరాజిలెన్మిగుల నాశిశుమౌళినిమిత్తమై తదం
     భోరుహసంభవుండవనిఁ బూనిరచించిన దండమోయనన్.

సీ. రమణీయధవళ గోరాజవాహనమధి
              ష్ఠించియల్లన సంచరించినట్లు
    గంధర్వులొగియంత్ర గాత్రంబులనుజుట్టు
             బలసిసంగీతము ల్పాడినట్లు
    జయజయరక్ష రక్షకృపానిధేపాహి
            యంచు దేవతలు ప్రార్ధించినట్లు
    వాదంబులను బ్రతి వాదులనోడింప
           యెలమి విద్యాపీఠ మెక్కినట్లు.

గీ. నిద్రలోఁగాంచి యంతలో నేత్రయుగము
    దెఱచియేమియుఁగాన కబ్బురముఁజెంది
    దెసలుపరికించి యివ్వధూతిలకముల్ల
    మలర మరలను గనులమూయం గడంగు.

శ్రీ శంకరాచార్యుని యవతారఘట్టము

శా. సూర్యాదిగ్రహకోటిస్వోచ్ఛగతమై సొంపార నిర్దుష్టమై
    యార్యంబై తగులగ్నమందుఁగనె సౌఖ్యంబొప్ప శ్రీశంకరా
    చార్యుండత్తరుణీశిరోమణియునా శర్వాణిసేనాని న
    ట్లార్యుల్సంతసమందదుందుభులు మ్రోయందివ్యమార్గంబునన్

సీ. ధృతివోవవిపరీత మతనాదిహస్త పు
            స్తక మకస్మాత్తుగా జారిపడియె
    జెలఁగివేదవ్యాసు చిత్తరాజీవంబు
           వికసించెనిగమ మస్తకములలరె
    గాడ్పులద్భుతదివ్య గంధబంధురములై
          వీచెవేల్పులు పుష్పవృష్టిగురిసి