పుట:కాశీఖండము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 59

స్ఫోటికమణిజపమాలా
వ్యాటికి తక్క రసరోరుహాంగుళిపార్శ్వున్. 61

క. పంచబ్రహ్మంబును శ్రీ
పంచాక్షరమును నఘోరపాశుపతంబున్
గించిత్బ్రస్ఫుటదధరో
ష్ఠాంచలముగ జపము సేయునాదిమశైవున్. 62

మ. అవధానంబున నప్పటప్పటికి భక్త్యావిష్టుడై పార్వతీ
ధవ! గంగాధర! నీలకంఠ! మదనధ్వంసీ! మహాదేవ! రు
ద్ర! విరూపాక్ష! భుజంగహార! యనుచున్ ధారాధరవ్యూహసం
భవగర్జారభటిన్ బఠించుఁ బరమబ్రహ్మర్షి లేఖర్షభున్. 63

సీ. అంతర్విలోకనవ్యాప్తి యుద్వాసించి
బాహ్యంబునకు దృష్టి పాఱ విడిచి
లీల రుద్రాక్షమాలిక దక్షిణశ్రవ
శ్శష్కులీశిఖయందు సంతరించి
పదిలంబుగా మున్ను పరిఢవించినయట్టి
నలినాసనంబుబంధము వదల్చి
వేదాగమపురాణవిద్యోద్భవము లైన
పురమర్దనస్తోత్రముల పఠించి
తే. యప్పు డప్పుడ యోగసమాధి యుడిగి
యధికశాంతిఁ బ్రసన్నాత్ముఁ డైనవానిఁ
బ్రణవపంచాక్షరిమంత్రపరమసిద్ధుఁ
గుంభసంభవమునిఁ గనుంగొనిరి వారు. 64

తే. జయజయధ్వను లెసఁగంగ సంయములును
నమరులును మ్రొక్కి రపు డమ్మహాత్మునకును