పుట:కాశీఖండము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 43

తే. మ్రొక్కెదము నీకు నని మహామునులు సురలు
నలికతలమున సేవాంజలులు ఘటింప
ద్రుహిణుఁ డెంతయు నాత్మ సంతోషమంది
యందఱిని జూచి యిట్లని యానతిచ్చె. 7

తే. ఆద్య మగునీ స్తవంబున కనఘులార!
యేను బరితుష్టి నొందితి నిచ్చయందు
నేమి వలసిన నట్టిద యిత్తుఁ గాన
యిది యభీప్సిత మనుఁడు మీ రింపు మిగుల. 8

మ. నినవద్యస్థిరభక్తితోడి ననుఁ గానీ శంభు గానీ రమే
శ్వరుఁగానీ గుఱియించి యెవ్వఁరట యీసారస్తవంబు జపిం
తురు వారందఱ కేము మువ్వురము సంతుష్టిం బ్రసాదింతుమిం
పరువారన్ ధనధాన్యపుత్త్రపశురక్షాయుస్సుఖారోగ్యముల్. 9

వ. మీ కెయ్యది యభీష్టం బట్టివరంబు గోరుం డిచ్చెద. ఇక్కడికి వచ్చియు నిట్లేటికి నాకులత్వంబు విడువరు! స్వస్థులరు గండు. నాలోకంబునఁ గామక్రోధలోభమోహమదమాత్సర్యహింసాసూయాదులు లేవు. మూర్తంబు లగు నీయమ్నాయంబులు విద్యలు యజ్ఞంబులు దక్షిణలు సత్యధర్మతపోబ్రహ్మచర్యముఖ్యంబులు నుల్లసిల్లెడుంజూడుం డని మఱియు నిట్లనియె. 10

సీ. తల్లిదండ్రులకు నిద్దపుభక్తి ఠవణిల్ల
శుశ్రూష చేసిన శుద్ధమతులు
పతులకు నిర్వ్యాజపరమతాత్పర్యతఁ
బరిచర్య సలిపినపద్మముఖులు
సజ్జనావళికి నిష్కారణంబున నుప