పుట:కాశీఖండము.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

381


సీ.

సంస్తుతించిరి బహ్వృచప్రపంచంబుల
        నొకకొంద ఱసితకంఠోపకంఠు
నుచ్చైస్వనంబున నొకకొందఱు నుతించి
        రార్యాకళత్రు నధ్వర్యశాఖ
శివునిఁ బ్రశంస సేసిరి యొకకొందఱు
        సద్భక్తిమై సప్తసామములను
సర్వజ్ఞుఁ బొగడి రధర్వవేదంబున
        నొకకొంద ఱొగి ప్రసంగోచితముగఁ


తే.

గాశికాతీర్థవాసులఁ గర్మవరులఁ
భూతిరుద్రాక్షధారులఁ బుణ్యనిధుల
నందఱినిఁ జూచి కరుణాసమగ్రబుద్ధి
నిట్టు లని యానతిచ్చె విశ్వేశ్వరుండు.

151


తే.

సేమమే విప్రులార! యనామయంబె?
పరమమాహేశ్వరాచారనిరతులార!
కుశలమే? కాశికాతీర్థకోటిదివ్య
లింగపూజైకతైనాంతరంగులార!

152


వ.

అనిన విని మందాకినీతీర్థంబు హయతీర్థంబు మత్స్యోదరితీర్థంబు కపాలమోక్షతీర్థంబు నాదిగాఁ గల తీర్థంబులనుండి యేతెంచినబ్రాహ్మణోత్తములు మృత్యుంజయునకు నమస్కరించి యిట్లని విన్నవించిరి.

153


తే.

అసియు వరణయుఁ గూడినయంతనుండి
సంగమేశ్వరతీర్థంబు సందుదాఁక
గగనగంగాతటంబునఁ గదలకుండు
తీర్థవాసుల మమృతదీధితికిరీటి!

154