పుట:కాశీఖండము.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

257


జననిఁ దలఁచి ప్రయాసంబు సంస్మరించి
మోసఁ దర్కించి యవ్వైశ్యముఖ్యుం డుండ.

67


సీ.

మధ్యాహ్నకాలంబు మందాకినీవారి
        నభిషేక మొనరింప నబ్బ దయ్యె
శివుని విశ్వేశ్వం శ్రీమన్మహాదేవు
        మదనారి వీక్షింప నొదవ దయ్యె
దండపాణిని డుంఠి దక్షిణామూర్తిని
        గాలభైరవుఁ గొల్వఁ గలుగ దయ్యె
శ్రీవిశాలాక్షికిఁ జేదోయి మొగిడించి
        శిరసుపైఁ జేర్పంగ దొరక దయ్యెఁ


తే.

గోమటికిఁ దల్లియస్థులకోకమూట
పాపకర్ముండు చెం చర్థభార మనుచు
వంచనాపాటవంబునఁ గొంచుఁ బోయి
యారివేగంబు చేసిన కారణమున.

68


శా.

జాలిం బొందియు డప్పిఁ జెందియు బుభుక్షావేదనం గుందియున్
వ్యాళాభీలకరాళతీవ్రతరమధ్యాహ్నార్కరోచిశ్ఛటన్
జాలం గుందియునుం గిరాటుఁ డరిగెన్ సంరంభశుంభద్గతిన్
వైలక్ష్యంబునఁ జెంచువెంట జననీవాత్సల్యనిఘ్నాత్మతన్.

69


వ.

అంతక మున్న (యొక్క) కాంతారంబున నమ్మూట విడిచి యాయాటవికుండు పెట్టెఁ దెఱచి యస్థిశకలంబులు చూచి తనవృథావస్థకుఁ జిన్నఁబోయి యవి యచ్చోటన పారంజల్లి తన పల్లెకుం బోయి మఱుఁగుపడి యుండె. ధనంజయుండును నప్పక్కణంబున కేతెంచి.

70