పుట:కాశీఖండము.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

శ్రీకాశీఖండము


యెక్కంద్రోచి ఘృతంబు నించి నిజవస్మ్రైకాంశముం జించి చే
నొక్కెన్ వత్తిగ నేఁతఁదోఁచెను శిఖ న్యోజించె వైశ్వానరున్.

123


సీ.

పక్వాన్నపాత్రంబు పాణిఁ గైకొని బహి
        ర్ద్వారభూమి భుజించువాంఛ నపుడు
వెల్వడి వచ్చుచో విధివశంబున వాని
        కాలివ్రే లొకనియంగంబు దాఁకెఁ
దాఁకిన వాఁడు తత్తఱపాటుతో మేలు
        కని ముచ్చు మ్రు చ్చని కళవళించెఁ
గళవళింప గతానుగతికమార్గంబున
        నాక్రోశ మొనరించి రఖిలజనులు


తే.

నన్నపాత్రంబు విడువక యవనిసురుఁడు
పాఱె భయవిహ్వలుం డయి బయలువట్టి
వెంటఁ దగిలి తలవరులు వెణగుపడఁగ
బాణముల నేసి చంపి రా బ్రహ్మకులుని.

124


తే.

అతనిఁ గొనిపోవఁ బనిఁ బూని యమునిభటులు
వరుణపాశోగ్రహస్తులై వచ్చి రపుడు
వానిఁ గొనిపోవఁ బనిఁబూని వచ్చి రపుడు
త్ర్యంబకునికింకరులు విమానంబు గొనుచు.

125


వ.

అనంతరంబ పట్టిసత్రిశూలఖట్వాంగప్రముఖబహువిధప్రహరణపాణు లగుపినాకపాటిభటులం జూచి భీతులై కృతాంతకింకరులు కరపంకజంబులు మొగిచి వారి కిట్లనిరి.

126


తే.

అభవుకింకరులార! మహాత్ములార!
తగవు ధర్మంబు పాడి పంతంబు దెలియు
మీకు నడ్డంబు గలరె ముల్లోకములను?