పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్తారము సేయఁగాఁ దగినసత్కథయెయ్యది గల్గునో యటం
చారయుచున్ మదీయహృదయంబునఁ గోర్కులు నివ్వటిల్లఁగన్.

21


తే.

ఉండి యొకనాఁటిరేయి నాయుల్లమునను, మత్ప్రభుండైనయట్టి శ్రీమంగళాద్రి
నిలయు నరసింహు భక్తవత్సలు దలంచి, శయ్యమీఁదను నిదురించు సమయమునను.

22


సీ.

శతకోటికందర్పసౌందర్యరేఖావిమోహనంబు ఖగేంద్రవాహనంబు
హారకోటీరకేయూరాదిభూషణస్ఫూర్జితంబు కలంకవర్జితంబు
దరహాసహసితవిస్ఫురితజీవంజీవజీవితంబు సుపర్వసేవితంబు
సంపద్విలాసినీసరసభుజాలతాలింగితంబు కృపాతరంగితంబు


తే.

గురుతరానంతకళ్యాణగుణమణీధు, రంధరంబు లసత్కంబుకంధరంబు
విష్ణుదివ్యస్వరూపంబు వేడ్కతోఁ బ్ర, సన్న మయ్యెను మామకస్వప్నమునను.

23


వ.

ఇట్లు మదీయజన్మాంతరసహస్రసంచితతపఃఫలంబునం బ్రసన్నంబైన భగవద్దివ్యమం
గళవిగ్రహంబు సందర్శించి కంచుకీకృతపులకోద్గమశరీరుండనై యానందరసకందళిత
హృదయారవిందుండ నగుచు లేచి సాష్టాంగవందనంబు లాచరించి నిలిచి స్తోత్రం
బులు చేయుచున్ననన్నుం గరుణామృతశీతలకటాక్షంబుల వీక్షించుచు గంభీరమృదు
మధురభాషణంబుల నిట్లని యానతిచ్చె.

24


క.

మును పనిరుద్ధచరిత్రం, బనుకృతి రచియించి మంగళాచలపతినై
తనరారు నాకు నంకిత, మొనరించితి నేను బ్రీతి నొందితి నింకన్.

25


శా.

మద్భక్తుండు పురూరవుండు మును ధర్మంబొప్పఁ బాలించె నే
తద్భూమండల మేకచక్రముగఁ దద్వార్తల్ పురాణోక్తముల్
తద్భావార్థ మెఱింగి విస్తరము నొందం జేయు మస్మత్ప్రసా
దోద్భూతాద్భుతశేముషీచతురవాగ్యుక్తిం బ్రబంధంబుగన్.

26


వ.

తత్ప్రబంధంబు మద్గోపాలనామాంకితంబుగా రచియింపుము మదీయకృష్ణావతారసగు
ణబ్రహ్మోపాస్తిపరులు నాకుం బ్రియతములు గావునఁ దద్రూపంబున నీచే నుపాసి
తుం డైననీహృదయంబున వివరింతు నని యానతిచ్చి యప్పరమేశ్వరుం డంతర్థా
నంబుఁ జేసినట్లయిన మేలుకాంచి యాశ్చర్యమిళితప్రమోదమానసుండనై యద్ది
వ్యవిగ్రహంబుఁ దలంచి మ్రొక్కుచుండితి నివ్విధంబున నిష్టదేవతానుగ్రహంబు
వడసినవాఁడనై తత్ప్రబంధంబు రచియింపఁ బూని, కవిసమయసిద్ధతావిచారంబున
మద్వంశక్రమం బెఱిఁగించెద.

27


శా.

శ్రీపేర్మిన్ శశివోలె బ్రహ్మకులవార్ధిం బుట్టి కౌండిన్యగో
త్రాపస్తంబపవిత్రసూత్రకలితుం డై రామసింహాసనా