పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

29

ద్వితీయాశ్వాసము


మ.

అమృతాంభోనిధి లక్ష్మితోడ నుదయంబై రాజనంబొల్చి తో
రముగా సత్పథవర్తినా నెగడి సర్వజ్ఞావతంసుండవై
కమనీయాఖిలసద్గణంబులనుతుల్ గైకొన్నని న్నెన్న శ
క్యమె? యీ యుత్పలపత్రలోచనఁ గృపం గాపాడు రాకాశశీ!

26


వ.

అని మలయపవమాను నుద్దేశించి,


శా.

శయ్యాదంభమున న్మురాంతకుఁడు భూషాకైతవస్ఫూర్తిచే
నయ్యార్యారమణుండు దాల్చిరి భుజంగాధీశుల న్నీయసా
హాయ్యప్రస్ఫుటధాటి కోర్వ కనుచో నబ్జాలాస్యలా యోర్చువా
రయ్యా గంధసమీర ప్రోవగదవయ్యా యీకురంగేక్షణన్.

27


వ.

అని ప్రశంసించి తదనాభిముఖ్యంబున కిట్లని యుపా
లంభించిరి.


గీ.

కొమ్మల నదల్చు నెప్పుడుఁ గమ్మగాలి,
విధుతనయుఁడు మనోజుఁడు, మధుఁడు జాతి
వైరి, దోషాకరుం డుడువల్లభుండు
గలికి, వీరికి సుగుణంబు గలుగు టెట్లు?

28


వ.

అని మనోభవు నుద్దేశించి,


క.

వనముననె సంభవించియు
వన మేర్చుదవానలంబు వరుసయెఱిఁగి కా
మనమున జనించి మన్మథ,
మనము గలంచంగ నీవు మదిఁ డలఁచితి వౌ.

29