పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము


నీఱుగౌరులఁ గెడపెను,
బీఱువడుచు దాయులెల్ల బెదరంజెదర౯

క. అని ద్రోణుఁడు ధృష్టద్యు,
     మ్మునిఁ గనలునఁ దారసించి మొనలుతలంక౯
     దనసింగిణి వాలమ్ముల,
     ననువులు నాటంగనేయ నాతఁడువఱచె౯.
తే. ద్రుపదుకొమరుఁడు రారాజుదొఁడరితేరు,
     నుగ్గుచేసిన వెన్నిచ్చె సిగ్గువిడిచి
     చేకితానుఁడుఁ గృపుఁడును జేవమీఱఁ,
     బోరి రేడవనాఁడాలపోతులట్లు.
సీ. ననలెత్తువేడ్క నునాధుజ్జ్జ్జ్జ్జ్ండు మొదలగు
                                 గాంధారికొడుకులఁ గవిసిభీముఁ
     డుద్దవిడినివారిఁ బెద్ద్దనిద్దురఁబుచ్చి
                                 యేనుంగులనుజేసెఁ బీనుఁగులను
     మఱి యలంబసుఁడచు మానిసిదిండియి
                                  రావంతు మార్కొని లావుచూపి
     పెద్దతడవునకుఁ బిద్దించె నాతనిఁ
                                   గవ్వడియెంతయుఁ గస్తిచెంద
     మఱిఘటోత్కచుండుమాగ్కొనిద్రోణుండు,
     మొదలుగలుగువారిమురువడించి
     యలఁతిమూఁకినెల్ల నలుఁగులపాల్సేసె,
     నవలినాఁడు వేల్పులబ్రపడఁగ.

క. ఎనిమిదవనాఁటి రాతిరి,
     చనువున దుర్యోధనుండు చనిభీఝ్మనితోఁ