పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

59


నాహవం బచట దైవాధీనమై కల్గె
        నేని మమ్ముఁ దలంపు మేమఱకుము
క్షణములో నట వచ్చి రణకేళి వీక్షించి
        మగుడి యెఱింగింతు మాధవునకు


గీ.

దనుజమదభంగకరచక్రధారి శౌరి
శోణితపురంబుఁ గదిసినచోఁ ద్రిణేత్రుఁ
డైన నెదిరించి యనిమొన నానఁగలఁడె
బాణుఁడును గీణుఁడన నేల? భయము నీకు.

84


చ.

అనుటయుఁ జిత్రరేఖ మది నంతయు నట్లన కాఁదలంచి సం
జనితఘనప్రహర్షుఁడగు సంయమివర్యునిచే ననుజ్ఞఁ గై
కొని మఱియుఁ బ్రణామములుఁ గోర్కెలుమీర నొనర్చి వేగమే
చని యల శౌరిమందిరముచాయ నభంబున నిల్చి వేడుకన్.

85


సీ.

పంచరత్నంబులపనిహర్వులను జాల
        బాగుమీరిన మొకపడకయింటఁ
గొమరైన యపరంజికోళ్ళమంచంబున
        మేరువుపై నున్న మేఘ మనఁగ
శృంగారములకెల్ల శృంగారమై మించు
        శ్రీరాజగోపాలశౌరి నపుడు
రుక్మిణిమొదలుగా రూఢి కెక్కినయట్టి
        కులసతుల్ పెక్కండ్రు కొలువు సేయఁ


గీ.

జూచి సేవించి యెంతయు సోద్యమంది
జగతిఁగల మాయ లెల్ల నీస్వామి యెఱుఁగు
నితని వంచించి యనిరుద్ధు నెత్తికొనుచు
నేఁ బురముఁ జేరఁగ నుపాయ మెద్ది! యనుచు.

86