పుట:ఉత్తరహరివంశము.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

235


క.

హరియును ముదమున గిరిశ
జ్వరరచితమదీయవినుతి వచనవ్రజమున్
నరుడు పఠించినఁ దలఁచిన
జ్వరరహితుం డనుడు జ్వరుఁడు సంతస మొదవన్.

125


వ.

నారాయణునకుఁ బునఃప్రణామం బాచరించి సంగరంబు వెడలెఁ దద
నంతరంబ సంరంభవిజృంభితుం డై పీతాంబరుండు నీలాంబర ప్రద్యుమ్ను
లిరుదెసల బలసి నడువ నసురబలంబు గదిసిన.

126

కృష్ణ ప్రద్యుమ్న బలభద్రులు రాక్షసవీరులతోఁ బోరుట

మ.

గరుడస్యందను లైనమూవురకు రక్షశ్శూరసైన్యంబుతో
సురసంఘావృతజంభశాత్రవసభాశోభాఢ్యరంభాంగనా
వరముఖ్యామరభీరుభాసురమనోవైదగ్ధ్యరోధోత్సుకో
దురతాలాలితయోధవిక్రమమిళద్యుద్ధంబు సిద్ధించినన్.

127


క.

కరులును హరులును దేరులు
నరులు దెరలఁ బోర శౌరి నలఁచుం గలఁచుం
గరములు నురములు శిరములు
సరములుగాఁ గ్రుచ్చు మెచ్చు జరగుం బరఁగున్.

128


వ.

ఇట్లు బడబానలకీలాకలావసదృశంబు లగుశరంబులం బరబలంబులం
బఱపి తత్సైన్యంబు దైన్యంబు నొందించి సింధుకన్యాధవుండు పాంచజన్యం
బొత్తె రోహిణీనందనుండు సనందనుండై శంఖంబు పూరించె నప్పుడు రమా
వల్లభ భల్లప్రహతంబు లై డొల్లుభటులతలలు తాలఫలంబులం బోలం దదు
పరినృత్యమాకంకగృధ్రపర్ణంబులు పర్ణపుటంబుల ననుకరింప మధుమథనప్రదర
దళితంబు లగుమకుటమాణిక్యంబు మెఱుంగులగములు నిజజయలక్ష్మీ
నీరాజనదీపప్రభారాజులుగాఁ దదనురూపంబు లయి ధరం దొరుగు సితాత
పత్రంబులు రజతభాజనంబులుగాఁ బీతాంబరాంబక భీతనిశ్వసత్కరికరశీక
రాసారంబు గగనమందాకినీబిందుసందోహంబులం దనకు శిశిరోపచారంబులు
చేసినచందంబుఁ దెగడం దదుచితంబు లయి మీఁదికి నెగయుకుంభికుంభ
ముక్తాఫలంబులు సురముక్తాసుమనోవర్షశోభాకర్షణంబు చేయ నన్యోన్యబాణఘట్టనం,