పుట:ఆముక్తమాల్యద.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తాళప్రశ్నలు మాని, మే న్గొనుడు; బేతాళ చ్ఛలోక్తిన్ రుషం
దూలింపం దలఁతేని, పుట్టు మఱి నూతు ల్ద్రవ్వ బేతాళముల్."

65


వ.

అనిన సాలకటంకటేయుండు సాలఁ గటకటంబడి, కార్యేచ్ఛం గన్నీరు గ్రుక్కు
కొని, “కటకటా! కైటభారి కనుంగు లగు డింగరీలు దయాళువులు గావలవదే?
తొల్లి దర్శనప్రవర్తకుండై వైయాసికంబు లగు సూత్రంబులు వివరించి విష్ట
రశ్రువు నద్వైతవైశిష్ట్యంబుఁ బ్రతిష్ఠించిన లక్ష్మణాఖ్య యోగీంద్రుండు, చిర
కాలసేవాసంతుష్టుఁడై నిజదేశికం తగు పూర్ణాహ్వయుం డనధికారుల కీకు మని
విధియుక్తంబుగాఁ దనకుఁ బ్రసాదించిన గీతాచరమార్థంబుఁ, గృపాతరంగి
తుండై రంగేశధామ దామోదరనామ చామీకరగోపురం బెక్కి, యుచ్చైస్స్వ
నంబున నుచ్చరించినఁ గురుం ఉలిగిన, 'దేవా! దేవరయాజ్ఞ మీఱి యే
నొక్కరుండ రౌరవంబునం బడుట మేలో? భాగవతపరిషత్తునకుఁ బరమపద
మగపడుట మేలో? యని వితర్కించి నీ వుచ్చరించుట గా నుచ్చరించితి' నని
తదభినందింతుం డయ్యె. నతండ నిజచ్ఛాత్రసత్త్రంబునకుఁ బ్రత్యహంబును
గల్యంబున మూల్యం బొల్లక గవ్యంబు సమర్పించి వేఁడిన వల్లవీవల్లవులకుఁ
బరమపదంబుఁ బ్రసాదించె; నతండ బంధముక్తుండయ్యు నవతారాంతరంబునఁ
గాలాంతరంబున సంకుచితజ్ఞానులై విషయపరులగు నరులకుం బరమునందలి
తీపొదవ సుందరజామాతృ నామంబున నర్చిరాదిగతి విశదీకరించె; నతండ
యిటమీఁద యాదవగిరిటెంకణంబు పాషండసంకులంబుగా వచ్చినఁ దచ్చ్యు
తికి శఠకోపసమాఖ్య సంభవించి నీరంధ్రవాదంబున నంధ్రాదివిషయ విద్వ
జ్జనంబుల నధోక్షజవిజయవాదభిక్ష వేఁడి దిగ్విజయంబు సేసి గరుడకుధర
గుహాకుంఠనృకంఠీరవంబు కుహనాత్రిదండియై బ్రుసీకుసుంభాంబరాంభః
కుండిక లొసంగ నంగీకృతాంతిమాశ్రయుండై, ఫణిప కణభు గక్షపాద బాద
రాయణ కపిల జైమిని శాసనంబులు మఠ మహానస మహీసురులు మున్నుగా
నెంతేవాసి నంతేవాసులకుఁ దెలివి పఱుపం బరమహంసానుష్ఠానపరకాష్ఠయై,
పదయుగప్రసన్నభువనప్రపంచపంచజనహృదయభవనంబులం బద్మాచద్మా
క్షులు పల్లేర్లు దుడిచి పాడెక్క భక్తి భోధించి భూతలంబుఁ బావనంబు సేయం
గలవాఁడు. మఱియు హయవదనపదారాధకుండై వేంకటేశుండను నింకొక్క
మనీషి మధుమథనమతప్రతిపాదకం బగు ప్రబంధశతంబు రచించి శిలోంఛ
వర్తనంబునం దపంబు సేయం దనకు జరచ్ఛదనశాకాదానంబు సేయు నగ