పుట:ఆముక్తమాల్యద.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జదువులమాట లాడి కనఁ జాల వొకానొక మెచ్చు, నొక్కఁ 'డీ
చదివిన కూర వింతచవి, చాలఁగఁ, దె' మ్మను మెచ్చు దక్కఁగన్.

35


వ.

అని గీష్పతి మతం బవలంబించి నిజాలాపహేళనపరుఁడైన రక్కసు కుత
ర్కోక్తులకుం గృష్టస్మరణంబు సేసి యిందులఁ బొందుపడు ప్రత్యుత్త
రంబుల వీనిఁ గెలఁకిన బుద్ధి క్షోభంబుగా, నింతకంటే నేమి యబద్ధంబులు
వినంబడునో, మీఁదఁ గార్యంబు గల మాకు దీనిఁ గాదనం బని లే, దని
యందంబుఁ గూడ కొని, ఛందోనువర్తనపరుండై, నీచసంస్మృతికి రోసి,
తన్ముఖోల్లాసంబునకు శబ్దచ్ఛలంబున నంతర్గతంబున సుగతు నిడుకొని నీవు
సర్వజ్ఞుడ, వేను నరుఁడ, హీనకులుండ, ననభ్యస్తశాస్త్రుండ, నీ
కుత్తరం బీ శక్తుండనే, మద్వచనస్థాలిత్యంబులు సహించి దయచేసి నమ్మి
మత్ ప్రార్థనంబు గావింపుము.

36


శా.

ప్రఖ్యాతుండవు దైత్యులందు మును, పా పైనొక్క నీకా యశో
భిఖ్య న్నేనును జేర్తు, మే యొసఁగుఁ దప్పింప, న్వ్రతం బొక్కఁడే
ముఖ్యంబై యొనరింతు, దాని సఫలంబు న్సేయఁగా లేవుఁగా,
‘సఖ్యం సాప్తపదీన” మ న్మన మిథ స్సాంగత్య మూహించుచున్.

37


వ.

అది యెద్ది యంటేని.

38

దాసరి యొట్టుపెట్టి తప్పించుకొని కైశికసేవకు పోవుట

క.

ఈకుఱఁగటి యీ కుఱుఁగుడి
వైకుంఠనిఁ బాడి వత్తు వ్రతముగఁ, దత్సే
వాకృతికడవట నశనము
నీ కౌదు; న్ముఖ్య మిదియ నేఁ డగు దుదకున్.

39


ఉ.

అంచు నతండు పల్క, దరహాసితఁ జెక్కిలిఁగొట్టి లెస్స పం
డించితి వోయి దాసరి, వనిం దెరవాటులు గొట్టికొట్టి మే
న్వెంచి విరక్తి దాసరివి, నిన్నఁ గదా యయినాఁడ, వీ మమున్
గొంచెముఁ జేసి త్రాడ్గొఱికికోఁ దలపోసెదు, మెచ్చితి న్నినున్.

40


శా.

ఏరాజ్యఁబు నరుండు నోరి కడివో నీబోధ మాలించు? నిం
కేరాజ్యంబు నరుండు బాసకయి మే నీఁ దాన యేతెంచుఁ? దీ