పుట:ఆముక్తమాల్యద.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

భండారముతో హయమద
శుండాలఘటాళి దనదు సొమ్మై పాగా
నుండిన, నాతడ వాయదె
పండితుఁడును బిరుదునైన పతికిని బయలై.

232


క.

కడుపున నొకకడి దఱిఁగినఁ
జెడఁ జూచుటె కాక పతికిఁ జెలియుం గలఁడే?
ఒడి దంద విడువఁజెల్లునె?
నడపవలయు నేర్చినట్లు నమ్మకయె కృపన్.

233


చ.

ఒకటికి రోయకుంట గను మున్నవియుం, ద్రుపదుండు మారణే
ష్టికిఁ బసిఁ జూపి వేఁడ మునిసింహుఁ డొకండు తమన్న వేల్చుఁ? బం
డొకఁ డపవిత్రభూమిఁ గని యొల్లక యేఁ జనఁ దా గ్రహించె రో
యకనియెఁ దాన న ట్లెఱుఁగ నౌఁ, జనుసర్వముఁ గాన శక్యమే?

234


క.

వీఁ డెడరునఁ గీ డెన్నిన
వాఁ డని, జయ మైన, హింస వదలి కొనుము శ్రీ
పోఁడి; యహి యేమి గొఱ బ
ల్వాడి సెడిన, నట్టిదయకు వైరియు నమ్మున్.

235


తే.

దేశవైశాల్య మర్థసిద్ధికిని మూల
మిల యొకింతైన గుంటకాల్వలు రచించి
నయము పేదకు నరిఁ గోరునను నొసంగి
ప్రబలఁ జేసిన నర్థధర్మములు పెరుఁగు.

236


తే.

ప్రజ లవసి చన్నఁ బిలువ, కప్పసులఁ గొలుచు
నమ్మి, యిండ్లింధనంబుల కాయె, ననెడి
కలని నక్కైన యధికారిగల నృపతికి
నేడు దీవులు గొన్న సమృద్ధి లేదు.

237


మహాస్రగ్ధర.

ఉరవౌ చాగంబు భోగం బుభయము నొకపా లుగ్రసేనావనార్ధం
బిరువా ల్నిండారుబండారిలు చొర నొకపా లిట్లుగా నాయ మొప్పం,