పురోహిత ప్రధానుల నప్రాప్తయౌవనుం డగు నతని వినీతుఁగా మెలసి
కొం డని నియోగించి; వారల దానసమ్మానాదులం బ్రోపు మని కుమారు
నకు నప్పగించి; గోవిందచరణారవిందవిన్యస్తమానసుండై ఖాండ్యిక్యుం
డుభయకర్మంబు లుడివి; యవ్వనంబ తపోవనంబుగాఁ గొంతకాలంబు
కేశిధ్వజోపదిష్టభక్తియోగాసంధానంబున మధుమథనసాధర్మ్యంబు నొందెఁ..
గేశిధ్వజుఁడును దత్పుత్త్రునిఁ దత్ప్రధానులఁ దదీయరాజ్యపరిపాలన కనిచి,
మగిడి మిథిలాపురంబు ప్రవేశించి, యోగాశ్రయుఁడై భోగంబులం బుణ్యం
బులు, తదితరంబులు దురితంబులు, ప్రక్షీణంబులుగా క్షోణితలం బేలుచుండెం;
గావున ముముక్షున కుపాశ్రయణీయుం డధోక్షజుండు; పాండ్యక్షితీశా, నీ
వతని భజియింపు, మిదియె భక్తియోగంబు. దీనియందు నొక్క కొఱఁతగల
దంతరాయంబు నొందినఁ బునర్భవంబుఁ బొందించి మఱి ముక్తిఁ జేర్చు.
నట్లగుట నింతకంటే సులభోపాయం బాయోధనంబున నయ్యధోక్షజుండు
గాండీవి కుపదేశించిన శరణాగతధర్మంబ నిరపాయధర్మం.” బని పరిణతాంతః
కరణుం డగు నతనికి మూలమంత్రపూర్వకంబుగా ద్వయము ప్రసాదించి
భాగవతప్రధానుం గావించిన.