పుట:ఆంధ్రపదనిధానము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదకీయము

ఆంధ్రపదనిధానము మాకాకతీయగ్రంథమాలలో మొదటి యనుబంధగ్రంథముగఁ బ్రచురించితిమి. ఇంతకుమున్ను గ్రంథమాలాపక్షమునఁ బ్రచురించిన ఆంధ్రమంత్రులు, విక్రమోర్వశీయమును, వసుంధరను, దాసబోధన నాదరించినట్లే యీయుత్తమగ్రంథరాజమునుగూడ నాంధ్రమహాజను లాదరించినచో మేము ధన్యులము.

జీర్ణతరమైన నీగ్రంథమును గ్రంథమాలాపక్షమున నాంధ్రలోకమునకు సమర్పింప నత్యంతికృషి చేసిన గ్రంథమాలాసంపాదకులగు శ్రీ శేషాద్రిరమణకవులకు కృతజ్ఞతఁ దెలుపుకొనుట ప్రధానకర్తవము. గ్రంథముద్రణమునకు వలయుధన మొసంగి మాయుద్యమము నాదరించిన ప్రకాశకులకుఁ గూడ మేము కృతజ్ఞులము.

గ్రంధమాల చందాదారులందరు నీగ్రంథమును విధిగఁ గొనవలసిన యగత్యము లేదు. రాజపోషకులకు, పోషకులకు, సంసదీయులకు మే ముచితముగ నొసఁగుదుము. చందాదారులకు వలయునేని పోష్టేజితో 1-4.0కు నొసంగుదుము. ఆంధ్రసోదరులు మాయుద్యమము నభిమానింపఁ బ్రార్థితులు.

భవద్విధేయుఁడు,

వరంగల్లు

తూము వరదరాజులు

24-2-30

కాకతీయ గ్రంథమాలా కార్యదర్శి