పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మూలంబును, నభృతంబును, బరిశ్రాంతంబును, నవాగతంబును,
బ్రతిహతంబును, స్వవిక్షిప్తంబును, గ్రుద్ధమూలంబును, సవృత
సంప్రాప్తియు, గళత్రగర్భంబును, నాశానిర్వేదియు, దూష్య
యుక్తంబు నన నివి ముప్పదినాలుగుతెఱంగులై యుండు నందు
వ్యసనంబులు పరిహరింపరానివి యిరువదియొక్కటియును,
వ్యసనంబులు పరిహరించవచ్చునవి పదమూడునుం గలవు.
తత్ప్రకారంబు వివరించెద.

61

పరిక్షిప్తాది బలలక్షణము

సీ.

అరి చుట్టుముట్టిన నటుత్రోవఁగానక
            చిక్కియుండినఁ బరిక్షిప్తబలము
జనపతిచేఁ దిరస్కారంబు గడుఁజెంది
            మదిరోష మంద విమానితంబు
నతిరోగములచేత నలసి యేపనులకు
            నసమర్థమైనచో వ్యాధితంబు
నతిదూరగతిచేత మృతిఁజెందుగతి నా
           థావళి విడుచు దురాగతంబు


గీ.

గుఱ్ఱములు శూరులును మును గూలిపోవ
క్షీణమైయుండు నల పరిక్షీణబలము
వ్యసనమును జెంది ముడుఁగుచున్నట్టికతనఁ
బతికినప్పటి కని సేయఁ బనికిరాదు.

62


సీ.

అని సేయ నిట్టట్టు చనరాక యిఱుకున
           మెలఁగఁ గూడని యభూయిష్ఠబలము
బహుదేశముల కడపటనుండి వేళకుఁ
           జేరనేరని యవిక్షిప్తబలము