ద్వితీయాశ్వాసము
41
మునిపతి వెంట నేఁగె సురముఖ్యుని వీక్కొని; యింద్రుఁ డయ్యహ
ల్యను మది నెంచియెంచి మరునమ్ము లురమ్మున డుస్సి పాఱఁగన్.44
క. అమరావతికిన్ వెసఁ జని
యమరావలిఁ బనిచి కుసుమితారామములో
నమరారిన పువ్వులశ
య్య మరాళిగమనఁ దలఁచి యాత్మగతమునన్.45
ఉ. ఎన్నికలేల నీలమణు లెన్ని సరోజము లెన్ని దొండపం
డ్లెన్ని దరంబు లెన్ని గిరు లెన్ని మృణాళము లెన్ని పొన్నపూ
లెన్ని యనంటు లెన్ని దొన లెన్ని ప్రవాళము లెన్ని రత్నముల్
చెన్నుగఁ గూర్చి యేర్పడిచి చేసెను ధాత తదంగమాలికన్.46
చ. మదనునిపొందుఁ గోరి రతి మానిని నోమిననోములెల్ల నీ
యదన ఫలించెనో యనఁగ నంగనగుల్ఫము లుల్లసిల్లుఁ ద
త్పదము లొనర్చి పద్మజుఁడు పాణితలంబు విదుర్పఁ జిందుత
త్సదమలకాంతిబిందులు రసాలకిసాలబిసప్రసూసముల్.47
చ. మదవతిపాదముల్ దనకు మాతృసమానములంచు ధాత స
మ్మదమునఁ బూజచేసినసుమంబులనన్ నఖపంక్తి యొప్పగున్
మృదుగమనాగమంబు లెలమిన్ బఠియించి యుపన్యసించు చా
యఁ దనరు మంద్రనాదకలహంసకముల్ విలసిల్లు నింతికిన్.48
చ. నవముగ మోముచంద్రుఁడు గనంబడి కప్పురతావిగుప్పెడిన్
రవికనె పిక్కటిల్లెను ఘనస్తనచక్రము లొప్పెఁదారకల్
నవిసెను బాల్యపుంజడదినంబు లటంచని జైత్రయాత్రకై
కవదొన లుంచె నిర్గముగఁ గంతుఁడనన్ జెలిజంఘ లొప్పగున్.49
క. ఊరుయుగం బనుపేరన్
బారెడుబంగారునీటివాఁకను రతియున్
మారుఁడును జిన్నిగరిగలు
సౌరుగ ముంచిరనఁ జెలికి జానువు లమరున్.50