పుట:అహల్యాసంక్రందనము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

23

తే. మఱియు సభలోని మునులును సురలు నృపులు
     దారుచూచిన చెలుల వేర్వేఱఁ బొగడి
     “రంత రంతాయెఁ గద మహారాజసభ"న
     టంచుఁ గంచుకి వారల నమరబట్టె.96
క. అత్తఱిఁ బురూరవుం డను
     "మెత్తురె యొకపాటిదాని మిత్రావరుణుల్
     పుత్తడిబొమ్మకు గుమ్మకుఁ
     జిత్తజుచార్వసికి నూర్వశికి సరిగలరే?"97
క. ఆరాజరాజనందనుఁ
     డారాజుం జూచి "కొంటె లనుకొంటేనే
     నారీమణి రంభారం
     భోరుకు నూర్ రోసినట్టి యూర్వశి సరియే?"98
శ. అనుటయుఁ జందురు మనుమఁడు
     కనుదమ్ములు జేవురింపఁ గరకరిమీఱన్
     ధనరాజకుమారకునిన్
     గనుఁగొని యిట్లనుచుఁ బలికెఁ గాంతాళముతోన్.99
క. “ఉండ్రా, యక్షాధమ, నీ
     తండ్రిం గని తాళుకొంటిఁ దగఁ గాకున్నన్
     తీండ్రంబగు కత్తిని నీ
     జీండ్రపు నాలుకదళంబు ఛేదింతుఁ జుమీ!"100
చ. అనినఁ గుబేరనందనుఁ “డహా"యని బెట్టుగఁ గేక వైచి క్రొ
     మ్మినమిసలీను కప్పుజిగిమీసముపై జెయివైచి "యోరి ఛీ
     చెనఁటి, గరాస, యీసభను జెప్పినటుల్ మఱి నీవు చేయకుం
     డిన విడ రాచకోఁచ, ధగిడీ!" యని దిగ్గన లేచి వీఁకతోన్.101
మ. రమణీరత్నము రంభఁ జూడ బురుసారంగున్ జెఱంగున్ నెఱా
     కొమరుం దుప్పటి కాసెగా బిగిచి జగ్గుల్ మీఱు గ్రొం బైరుమాల్