ప్రథమాశ్వాసము
5
కరణంబులు నారాయణ
చరణంబులు నెసఁగు శూద్రజాతికి నిరవై.17
క. నాలవవర్ణం బనియెడి
పాలసముద్రంబునందు భావుకలక్ష్మీ
లోలుఁడు లోకావనకరు
ణా[1]లీలుఁడు కేశవప్పనాయఁడు వెలసెన్.18
ఉ. ఇంద్రుంు భోగ సంపద, నుపేంద్రుఁడు రూపముచేత, నా హరి
శ్చంద్రుఁడు సత్యవాక్యమునఁ, జంద్రుఁడు కాంతినిరూఢి, చాపని
స్తంద్రత రామచంద్రుఁడు, లసన్మతి చాతురిచేత శేషభో
గీంద్రుఁడె యంచు భూమిజను లెన్నఁగఁ గేశవనాయఁ డొప్పగున్.19
క. ఆ కేశవనాయనికిన్
రాకేశవదాతకీర్తిరాజితపుణ్య
శ్లోకుఁడు వేంకటనాయఁడు
శ్రీకాంతున కబ్జభవుని చెలువునఁ గలిగెన్.20
ఉ. చందురు ఱొమ్ముమెట్టి యరచందురుతాలుపు నఱ్ఱుగిట్టి యా
నందిని ముక్కు గుట్టి సురనాయకదంతిని జెక్కు గొట్టి య
స్పందితలీల సీరి యొడిఁ బట్టి చెలంగుచుఁ గీర్తి వీనులన్
విందొనరించు నార్యులకు వేంకటనాయఁడు భూపమాత్రుఁడే!21
క. పెదగురువపనాయఁడు త
త్సదమలమూర్తికిని బుట్టి శాశ్వతకీర్తిన్
గుదురై యీవిని జదురై
యెదురైన విరోధినృపుల నెల్ల జయించెన్.22
క. అతనికి గలిగెను బాదా
నతశాత్రవుఁ డెల్లిసెట్టినాయఁడు రేఖా
- ↑ శీలుఁడు