తృతీయాశ్వానము
77
హాయిగా నీ నితంబంబు లంటనియవె
కంటు నామీఁద నేల వాల్గంటి, నీకు.'97
ఉ. కురులకు వందనంబు తెలిగోముముఖంబునకున్ జొహారు నీ
యరుదగు కంబుకంఠమున కంజలి నీ కుచకుంభపాళికిన్
కరములు మోడ్చెదన్ బెళుకు కౌనుకు మ్రొక్కెద పంచబాణ మం
దిరమునకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్.98
క. అని చెలిపాదంబులపై
ఘనచింతామణిసురత్నకనకకిరీటం
బును మోపి లేవకుండిన
వనజానన సిగ్గువలపు వడ్డికిఁ బాఱన్.99
క. “దేవుఁడ వేలిన సామివి
పోవయ్యా! నీవు నాకు మ్రొక్కఁగఁ దగునా
లేవు” మని గుబ్బచనుమొన
లా విభునెద సోఁక నెత్తె నంగన ప్రేమన్.100
ఉ. ఎత్తిన పట్టువీడక సురేంద్రుఁడు తత్కుచకుంభపాళిపై
నత్తమిలన్ దురంతవిరహార్ణవపూరము నీదుకైవడిన్
హత్తి రసాలసాలమున నల్లెడు మల్లియతీవకైవడిన్
గుత్తపుగుబ్బలాడి చనుగుత్తులఁ దత్తను వొత్తె సొక్కుచున్.101
ఉ. అంతటఁ గొంతసేపటికి నంగన సిబ్బెపుఁ గుబ్బఁ గ్రుమ్మినన్
స్వాంతము జల్లనంగ బలశాసనుఁ డాసను మోవియాన నొ
క్కింత మొగంబు ద్రిప్పి "పడకింటికి రమ్మట కొన్ని సమ్మతుల్
కాంతుఁడ, నీ వొసంగినను గాని యొడంబడ" నంచుఁ బల్కుచున్.102
తే. చెట్టపట్టుక తనదు పూసెజ్జకడకు
వల్లభునిఁ దోడుకొని పోయి వలపు మెఱయఁ
దొడను దొడఁజేర్చి కూర్చుండి తోయజాక్షి
తోయజాక్షీణరసధార దొలుకఁ బలికె.103