చిరస్మరణీయులు, మొదటి భాగం/అజీముల్లా ఖాన్‌

వికీసోర్స్ నుండి

53

18. అజీముల్లా ఖాన్‌

(1834- 1859)

స్వదేశీ పాలకులు, సంస్థానాథీశులు బ్రిటిష్‌ పాలకులపై మండిపడుతున్న రోజుల్లో శక్తి కంటే యుక్తి మంచి ఫలితాలనిస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆంగ్లేయ మేధావులకు ఏ మాత్రం తీసిపోని విధంగా 1857నాటి పోరాటాలకు వ్యూహరచన చేసిన మేధావులలో ఒకరుగా అజీముల్లా ఖాన్‌ ఖ్యాతిగాంచారు.

1834లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జన్మించిన అజీముల్లా బాల్యం తన తల్లి ఆయాగా పనిచేసే అనాథ శరణాలయంలో గడిచింది. తొలిరోజుల్లో ఒక ఆంగ్లేయుని ఇంట పనివాడిగా చేరి పొట్టగడుపుకుంటూ కాలం గడిపిన ఆయన ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలను నేర్చుకున్నారు. ఆ భాషల మీద పట్టు లభించాక, ఆంగ్లేయుల ప్రవృత్తి తెలిశాక ఆయన వారి సేవకు తిలోదకాలిచ్చారు. ఆ తరువాత కాన్పూరు విద్యాలయంలో విద్యార్థ్ధిగా చేరి, తన అసాధారణ ప్రతిభ వల్ల అదే విద్యాలయం అధ్యాపకుడయ్యారు.

ప్రబుత్వ విద్యాలయంలో అద్యాపకుడిగా అజీముల్లా పనిచేస్తుండగా అయన ప్రతిభ గురించి విన్న కాన్పూరు అధినేత నానా సాహెబ్‌ పీష్వా ఆయనను తన పక్షాన వకీలుగా బాధ్యతలు నిర్వహించేందుకు ఆహ్వానించాడు. నానా పక్షాన వాదించేందుకు అజీముల్లా ఇంగ్లాండు వెళ్ళి అక్కడ రెండేళ్ళు గడిపారు. ఆ సందర్భంగా బ్రిటిషర్ల రాజకీయాలను,

చిరస్మ రణీయులు 54

ప్రవర్తనను, వ్యవహార సరళిని గమనించిన ఆయన కొంతకాలం తరువాత ఇండియాకు తిరిగి వస్తూ భవిష్యతును దృషిలో పెట్టుకుని పలు దేశాలను పర్యటించారు. ఈ పర్యటనలో మాల్టా చేరు కున్నప్పడు, ఆంగ్లో-ప్రెంచి సైన్యాలను రష్యా సైన్యాలు మాల్టా వద్ద పరాజయం పాల్జేయడం తెలుసుకున్నారు. ఆ కారణంగా రష్యా సైనికపాటవాన్నిపరిశీలించేందుకు ఆయన తన ప్రయాణం దిశను మార్చుకుని కానిస్టాంటునోపుల్‌ వెళ్ళారు.

ఆ తరువాత ఫ్రాన్స్‌, క్రిమియాలను సందర్శించి ఆయా దేశాల రాజకీయాలను, యుద్ధ ప్రక్రియలను, నాయకుల ఎత్తులు, జిత్తులను అధ్యయనం చేశారు. ఆ దేశాల ప్రజానీకం స్వేచ్ఛా-స్వాతంత్య్రాల పట్ల వ్యక్తంచేసిన అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆ లక్ష్యాల సాధన కోసం వారు సాగించిన పోరాటాలు ఆయనలో దాగి ఉన్న స్వతంత్ర- స్వేచ్చాయుత ఆలోచనలకు మరింతగా పదునుపెట్టాయి. ఈ సందర్భంగా బ్రిటిష్‌ పాలనాధికారానికి చరమగీతం పాడేందుకు తమతో సహకరించే దేశాల అధినేతలతో రహస్య స్నేహ సంబంధాలను కూడా కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు.

ఇండియా తిరిగి వచ్చాక నానాసాహెబ్‌తో తన ఆలోచనలను పంచుకుని 1857 నాటి కాన్పూరు తిరుగుబాటుకు వ్యూహరచన చేశారు. ఆంగ్లేయ వ్యతిరేక పోరాటాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మేరకు స్వదేశీ పాలకులకు, సైనికులకు నానా సాహెబ్‌ పేరిట ఆయన లేఖలు రాశారు. స్వదేశీ పాలకులంతా ఐక్యంగా ఆంగ్లేయుల మీద ఎందుకు ధ్వజమెత్తాలో ఆ లేఖలలో వివరించారు. ప్రజలలో దేశభక్తి భావనలను పెంపొందించేందుకు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టేందుకు పయామే ఆజాది అను పత్రికను కూడా ఆయన హిందీ, ఉర్దూ భాషల్లో వెలువరించారు.

అజీముల్లా ఖాన్‌ ఆనాటి పోరాటాలలో నానా సాహెబ్‌తో పాటు స్వయంగా తానూ పాల్గొనడమే కాకుండా, బేగం హజరత్‌ మహల్‌, మౌల్వీ అహ్మదుల్లా ఖాన్‌, ఝాన్సీలక్ష్మీ బాయి, మొగల్‌ రాకుమారుడు ఫిరోజ్‌షా, తాంతియా తోపేలకు మేధోపరమైన సేవలందించారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం పరాజయం అంచుకు చేరుకునేసరికి తిరుగుబాటు యోధులైన, నానా, హజరత్‌ మహాల్‌, ఫిరోజ్‌ షా తదితరులతోపాటుగా నేపాల్‌ అడవుల్లోకి నిష్క్రమించారు.

ప్రమాదాకర ప్రతికూల పరిస్థితులలో కూడా ఆంగేయులకు వ్యతిరేకంగా తుదకంటా పోరాడేందుకు అవసరమైన బలగాలను, ఆర్థిక సాధన సంపత్తిని సమకూర్చుకునే ప్రయత్నంలో అష్ట కష్టాలు పడుతూ, నేపాల్‌ లోని భుట్ వాల్‌ (Bhutwal) ప్రాంతంలో అజీముల్లా ఖాన్‌ 1859 అక్టోబరు మాసంలో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌