గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/శ్రీ రామమోహన ధర్మపుస్తక భాండాగారము
శ్రీ రామమోహన ధర్మ పుస్తక భాండాగారము, బెజవాడ.
ఆధునిక కాలమందు మానవుని జీవయాత్ర కష్టతరమైపోయినది. ఎవరికి వారు కాలూది నిలుచుటకుఁ గొట్టుకాడుచున్నారు. విశ్రాంతి తగ్గినది. కాలపరిణామముచేతను పూర్వపశ్చిమ పరిజ్ఞాన సంఘట్టనముచేతను, మన ప్రాప్యములు మన యలవాటులు మన మర్యాదలు నెన్నియో విధములఁ బూర్వముకంటే మార్పు జెందినవి. మనపూర్వులు దమ విశ్రాంతి కాలములయందు, నేదేవళముననో, యే తటాకోపొంత తరుచ్ఛాయలతో కూడి ఇహపర సౌఖ్యదాయకములగు నంశములను గూర్చి ముచ్చ టించుకొనుచుండిరి. ఇందువలన పుస్తకములను జదువగలిగినవారికే గాక, వ్రాయనుఁజదువను రాని వారలకు గూడ జ్ఞానమబ్బుచుండెడిది.
ఇప్పుడిదియంతయు మారినది. పూర్వముకంటే జనులు పట్టణముల కెక్కువగా మూగుచున్నారు. జనులకు విశ్రాంతి తగ్గినది, ఒకరి విశ్రాంతి సమయము మఱియొకరిదిగాదు. దేవాలయములయందు భక్తి రానురాను తగ్గుచున్నది. ఇది యుచితమా యనుచితమా యను నంశము ప్రస్తుతము విచారణీయము కాదు.
మనము క్రొత్తత్రోవల ద్రొక్కిననేగాని జ్ఞానాభివృద్ధి కానేరదు. పూర్వమువలె మనదేశ మభివృద్ధి బొందవలెనన్న మన పూర్వుల హృదయసీమలయందు దేవళము లెంత గౌరవనీయములుగా నెలకొల్పబడినవో, మన హృదయములయం దీనాడు పుస్తక భాండాగారము లంత గౌరవనీయములుగ నెలకొల్పబడవలెను. ఒండొరులు కలసికొని తమభావములను బ్రకటించుకొని యన్యోన్యము లాభము పొందుటకును, ప్రజాసామాన్యమునకు జ్ఞానమును వ్యాపింపజేయుటకును నేటి పుస్తకాలయములే ము ఖ్యసాధనములు. ఈ యుద్దేశ్యములను మనస్సులయందుంచుకొని, నలుదిక్కులకఱుగు నినుపదారులకు కూడలియై, ఆంధ్రదేశమునకంతకును నాయకమణిగా నొప్పుచున్న బెజవాడపురమున నీ "రామమోహన ధర్మపుస్తక భాండాగారము" ను నెలకొల్పిరి.
చరిత్ర సంగ్రహము.
కలకత్తా నివాసులగు శ్రీయుత బాబు హేమచంద్రసర్కారు యం ఏ.,గారి వలనను, లండను నగర మునందున్న “బ్రిటిషు అండు ఫారిన్ యూనిటేరియన్ సంఘము” వారివలనను ధర్మముగా నొసంగబడిన 200 పుస్తకములను జేర్చి 1908 సంవత్సరమునందు "ఆస్తిక పుస్తక భాండాగారము" అనునామమున పుస్తకభాండాగారము నొక బానిని ప్రార్థన సమాజమందిరమునఁ బ్రస్తుతము బ్రహ్మమతవ్యాపకులుగానున్న శ్రీయుత ఇ. సుబ్బుకృష్ణయ్య గారు స్థాపించిరి. కాని అయ్యది యొక మారుమూల నుండుటంబట్టి జనసామాన్యమున కుపయోగకారి కాజాలదయ్యె. ఇట్లుండ 1911 సం. జనవరిమాసమునందు కొందఱు యువకులు కూడి స్వల్పముగ చందాలను వేసికొని, ప్రార్థనసమాజము వారి యనుమతిమీద నాపుస్తకములను దీసికొనివచ్చి బకింగుహాంపేటలో నెల్లఱు వచ్చుటకు వీలయిన ప్రదేశమునందు “రామమోహన ధర్మపుస్తక భాండాగార” మను నామమున బ్రస్తుతభాండాగారమును నెలకొల్పిరి.
ప్రధమమున కొందఱు పెద్దలనడిగి యొకటి రెండు వార్తాపత్రికల నుచితముగ దెచ్చి సాయంకాలమునందు జదువుకొనుచుండిరి. వసూలయిన చందా మొత్తము ఇంటి యద్దెకును దీపపు ఖర్చునకుమాత్రము సరిపోవుచుండెను. కాని, యీభాండాగార మట్టి హీనస్థితియందు రెండుమూడు మాసములకన్న నెక్కువకాల ముండ లేదు. దినదినాభివృద్ధినొందుచు వచ్చినది.
ఇట్లు భాండాగార మభివృద్ధికాగా ప్రధమ వార్షికోత్సవసమయమున, కీర్తిశేషులైన శ్రీరాజా వెల్లంకి చినవేంకట్రామారావు బహద్దరు జమీందారు గారు భాండాగారమునకు శాశ్వతభవనమును తమ స్వంత ఖర్చుతో నిర్మించి యిచ్చెదమని వాగ్దాన మొనర్చి తమ సహజౌదార్యమును వెల్లడించిరి.
రామమోహన ధర్మ పుస్తక భాండాగారము, బెజవాడ.
రామమోహనధర్మ పుస్తక భాండాగారము.

పంచముల పాఠశాలయందు విద్య నభ్యసించుచున్న బాలురు బాలికలు.

రాజా వెల్లంకి చిన వేంకటరామారావు బహద్దరు
జమీందారుగారు.
నివేశన స్థలము.
గ్రంధభాండాగారములకు స్వంతభవనములుండిన గాని శాశ్వత ప్రతిష్టాపనలు కాజాలవని ప్రధమమునుండి యు ఈ గ్రంథాలయమువారికి గట్టి నమ్మకముగలదు. అభిమానులగువారు కొందఱు గ్రంధములను గొన్నిటిని, సామానులను గొన్నిటిని, సమకూర్చి నొకచో నుంచుట యు, కాలక్రమమున నవి నామమాత్రావశిష్టములగుట యు వీరు తరుచుగా జూచుచుండిరి. గ్రంథ భాండాగారము లెంత చిన్న వైనను తగుపాటిగృహములు వానికుండుట ప్రథాన కర్తవ్యమని వీరి యాశయము; అట్టి శాశ్వత ప్రయత్నలోపమే ‘మఖ'లో పుట్టి 'పుబ్బ'లో మాడెడు సంఘములకు మూలకారణమని వీరియనుభవమునుబట్టి ప్పగలరని వ్రాయుచున్నారు. అందుచేత ప్రత్యేక భవనము వలయుననెడి వాంఛ కేవల శైశ నావస్థయందుండగ నే వీరినావేశించినది. శ్రీ తిరువూరు రాజాగారు భవనమును గట్టించెదమని జేసిన వాగ్దానము వీరి నుత్సాహపరుపు, నివేశన స్థలమును సేకరించుటకై ప్రయత్నించిరి. దినదినాభివృద్ధినిగాంచుచున్న బెజవాడ పట్నమున స్థలమును సేకరించుట ఆల్పకార్యము గాదు.
అంతట 8_4_18 తేదీన ఈ సంఘమును కృష్ణాజిల్లా రిజిస్ట్రారు వారి ఆఫీసునందు 1860 సం॥ 21 నంబరు అక్టు ప్రకారము రిజిష్టరు జేసిరి. అది జరిగిన రెండుదినములకే బెజవాడ మునిసిపాలిటీవారు నివేశన స్థలములను వేలమున విక్రయించెదమని ప్రకటించిరి. అప్పుడు వీరిచే తులలో సొమ్మేమియులేదు. ఉత్సాహామును, స్వార్థ త్యాగుల యభిమానమును, మూలధనముగా జూచుకొని 2191 చ.గజముల స్థలమును రు 3424_2_3లకు కొన్నా రు. నివేశన స్థలమునకయిన ఖర్చులో శ్రీ మునగాల రా జాగారు శ్రీరాజా నాయని వెంకటరంగారావు బహద్దరు జమీందారుగా రయిదువందల రూపాయిలును, శ్రీపాటి బండ సుబ్రహ్మణ్యముగా రయిదువందల రూపాయిలును, శ్రీబొడ్డపాటి వెంకటప్పయ్యగా రయిదువందల రూపాయి లను యిచ్చియుండిరి. మిగిలిన సొమ్ము విరాళముల వలన వసూలయినది.
భవననిర్మాణము.
నివేశనస్థలమును గొనుటతోడను, అందుకై చందా లు వేయించుటతోడను వీరి పని పూర్తికాలేదు. శ్రీతిరు పూరు జమీందారు గారి దగ్గరకు బోయి తమ వాగ్దానము ను జెల్లింపవలసినదని కోరిరి. దయాపూర్ణుడగు నామహ నీయుడు వారి కోరికను నిర్వర్తించుట కంగీకరించెను, అప్పుడు, మద్రాసు గవర్నరు గారి శాసన నిర్మాణసభ్యుల గు ఘనతవహించిన పి, యస్. శివస్వామి అయ్యగారి చే 1918 సం॥ సెప్టెంబరు నెల 1వ తేదీన మునిసిపాలిటీవారి . వద్ద కొన్న స్థలమునందు పునాది రాతిని వేయించిరి. పిమ్మ ట భవననిర్మాణమును జేయనారంభించిరి. కడచిన డిశం బరు నెలలో శ్రీ చెన్నపురి రాజధాని గవర్నరుగారు బెజ వాడకు విచ్చేయు సందర్భమున శ్రీవారిచే బ్రవేశమహో త్సవమును జేయింపవలెనని కుతూహలమును జెందిరి. కా ని ఈభాండాగార భవనమును కట్టించుచున్న శ్రీతిరువూ రు జమీందారు గారు అకాలమరణము నొందుటచే వీరి కోరికను నెరవేర్చుకొన జాలక పోయిరి. పని బ్రారంభించి నపిమ్మట ఆపుటకు వీలులేక, శ్రీతిరువూరు రాజాగారు ఇచ్చిన రు 2100 లను వ్యయపరచిన పిమ్మట, రు 4000ల ను అప్పుజేసి పనిని సాగించి చాలాభాగమును పూతి౯ జేసి అందు భాండాగారము నుంచగలిగిరి. ఈభవనము యొక్క మొదటి అంతస్తు పూర్తియగుట కింకను రు 2000లు గావలసియున్నవి. దీనికి శ్రీ తేలప్రోలు జమీందారు గారు రు 1000 లనిచ్చెదమని వాగ్దానము చేసియున్నారు.
పంచములకు పాఠశాల.
శ్రీయుత అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు బి.ఏ., బి.యల్., గారి యాజమాన్యముక్రింద ప్రారంభింపబడిన పంచముల పాఠశాల 1914 జనవరి నెల నుండియు ఈ సంఘము యొక్క యాజమాన్యమునకు దీసికొనబడినది, ఇది పగటి పాఠశాలయైయున్నది. ఇందు బాలురు 24 గురును బాలికలు 8 గురును కలరు.
స్త్రీచదువరులు.
స్త్రీలకు ఉచితముగనే చదువు కొనుటకుగాను వారిగృహములకు వీరినౌకరుచేతనే గ్రంధముల నంపుచున్నారు. ప్రస్తుతము 24 గురు స్త్రీలు మాత్రము ఈలాభమునుపయోగించు కొనుచున్నారు.
ప్రార్థన సమాజము.
ఈభాండాగారమునకు కొనబడిన నివేశన స్థలము నకు శ్రీ పాటిబండ సుబ్రహ్మణ్యం గారు రు 500 ల విరాళ మొసంగియున్నారు. వారికోరిక ప్రకారము బెజవాడ ప్రార్థన సమాజమువారు మందిరమును నిర్మాణము జే సుకొనుటకుగాను ఒక మూలను 200 చ. గజమ్ముల స్థలమునిచ్చిరి.
ఆంధ్రదేశ గ్రంధ భాండాగార ప్రతినిధుల మహాసభ.
మన ఆంధ్రదేశము నందుగల గ్రంథాలయముల నన్నింటికిని పరస్పర మైత్రికలిగిన మిగుల లాభముగ నుం డుననియు, భాండాగారములయొక్క అభివృద్ధికి సాధన భూతముగ నుండుననియు తలంచి 1914 ఏప్రిలు 10వ తేదీన, ఈభాండాగారము యొక్క యాదరణ క్రింద బెజ వాడ పట్టణమున “ప్రధమ ఆంధ్రదేశగ్రంథ భాండాగా ర ప్రతినిధుల మహాసభ" గావింపబడినది.
ఇప్పుడీ భాండాగారమునకు 130 చందాదారులును 24 మంది స్త్రీచదువరులును గలిగి పదునాలుగు వందలు ఆంధ్రఆంగ్లేయ సంస్కృత గ్రంధములతోను ముప్పది నా లుగు ఆంధ్రాంగ్లేయ వార్తాపత్రికలతోను నలంకరింప బ డి యనుదినము ముప్పది మంది చదువరులు నాకరింపు చు న్నది. ఈభాండాగారముయొక్క భవనము తయారగు టకుసు, గ్రంధములను గొనుటకును పదివేల రూపాయ ల యిన గావలెనని మదింపు వేయబడినది. ఈ గ్రంధాలయ మిట్టి యున్నతస్థితిని వహించుటకు అగ్రాసనాధిపతుల కార్యదక్షతయు, కార్యదర్శుల నిరంతరపరిశ్రమయు నై యున్నది. ములు.
ఈగ్రంథాలయముయొక్క ముఖ్యోద్దేశములు.
రాజా రామమోహన రాయులవారి యొక్క జాపకార్థ మీ భాండాగారము స్థాపింపబడినది,
1. ధర్మభాండాగారములను, పఠనమందిరములను బెజవాడపురమున స్థాపించుటయు కృష్ణా, గుంటూరు జిల్లాలయందితరస్థలములలో స్థాపింపబడినవానిని దీనికి జేర్చుకొనుటయు,
2. చందాలను జెల్లించు చందాదారులకును, స భికులకును పుస్తకములను, పత్రికలను యెరువిచ్చుటయు,
3. సాంఘిక సమావేశములవలనను, ఉపన్యాస ముల మూలమునను ముఖ్యమగు విషయములం గూర్చి చ ర్చలను జరుపుట చేత, స్వస్థానమునందున్నట్టియు, ఇతర స్థలములయందున్నట్టియు జనులయందు పరిచయము నభి వృద్ధిజేయుటయు,
4. భరతవర్షీయుల ఉత్సవములను, కవులయొ క్కయు, ప్రవక్తల యొక్కయు, తత్వజ్ఞానవేత్తలయొ క్కయు సాంవత్సరీకోత్సవములను జరుపుటయు,
5. విద్యావిషయిక ప్రతిస్థాపనలను స్థాపించుట యు, ఇదివరకే స్థాపింపబడిన వానిని దీనికి జేర్చుకొను టయు,
6. భాష, మతము, శాస్త్రము, పరిశ్రమ మొ దలగు విషయములను గూర్చి జనసామాన్యమున కుపన్యా సముల నొసంగుటయు; జనసామాన్యమునకు జ్ఞానాభి వృద్ధి కరములగు కరపత్రములను, పుస్తకములను బ్రచు రించుటయు; పై విషయములకు వ్యతిరిక్తము గానట్టి యు జనసామాన్యమునందు జ్ఞానాభివృద్ధి గల్యుజేయున ట్టియు ఇతర పద్ధతుల నవలంబించుటయునై యున్నవి.
సమస్యలు.
1. మ. కులమున్ బాణముగొట్టగా నణగె బెక్కుల్ వర్ణ ముల్ గంటివే.
2. చీమ తుమ్మెగదరా దిగ్గంతులల్లాడగన్.